Tamil Actor Vijay: సీఏఏను తీవ్రంగా వ్యతిరేకించిన తమిళ నటుడు దళపతి విజయ్.. తమిళనాడు ప్రభుత్వం అమలు చేయొద్దని విన్నపం
- సీఏఏ ఆమోదయోగ్యం కాదన్న విజయ్
- అమలు చేయబోమని నేతలు హామీ ఇవ్వాలన్న నటుడు
- ఈ చట్టంతో ప్రజల మధ్య సామాజిక సామరస్యం దెబ్బతింటుందని ఆవేదన
- సీఏఏను అమలు చేసేందుకు పలు రాష్ట్రాల విముఖత
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ దళిపతి విజయ్ తీవ్రంగా స్పందించారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రజలకు నేతలు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి చట్టాన్ని అమలుచేస్తే అది దేశ ప్రజల మధ్య సామాజిక సామరస్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఏఏను అమలు చేయబోమని ఇప్పటికే పలు రాష్ట్రాలు స్పష్టం చేశాయి. ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే ఈ చట్టాన్ని తాము అమలు చేయబోవడం లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇప్పటికే స్పష్టం చేశారు. సీఏఏ చట్టంపై ప్రజలు రానున్న లోక్సభ ఎన్నికల్లో స్పందిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. వివాదాస్పద ఎన్నికల బాండ్ల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ వివాదాస్పద చట్టాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ ఆరోపించారు. సీఏఏ నిబంధనలను ఐదేళ్లపాటు పెండింగులో పెట్టి ఎన్నికల వేళ అమలు చేయడం ఏంటని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు.
సీఏఏను అమలు చేయబోమని ఇప్పటికే పలు రాష్ట్రాలు స్పష్టం చేశాయి. ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే ఈ చట్టాన్ని తాము అమలు చేయబోవడం లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇప్పటికే స్పష్టం చేశారు. సీఏఏ చట్టంపై ప్రజలు రానున్న లోక్సభ ఎన్నికల్లో స్పందిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. వివాదాస్పద ఎన్నికల బాండ్ల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ వివాదాస్పద చట్టాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ ఆరోపించారు. సీఏఏ నిబంధనలను ఐదేళ్లపాటు పెండింగులో పెట్టి ఎన్నికల వేళ అమలు చేయడం ఏంటని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు.