Stock Market: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు.. 1,384 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

Markets ends in profits
  • మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలువడంతో మార్కెట్లలో జోష్
  • 68,865కి చేరిన సెన్సెక్స్  
  • 419 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,384 పాయింట్లు ఎగబాకి 68,865కి చేరుకుంది. నిఫ్టీ 419 పాయింట్లు పుంజుకుని 20,687కి పెరిగింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (4.68%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.99%), ఎల్ అండ్ టీ (3.88%), కోటక్ బ్యాంక్ (3.80%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.63%). 

టాప్ లూజర్స్:
విప్రో (-0.10%), టాటా మోటార్స్ (-0.04%).
Stock Market
Sensex
Nifty

More Telugu News