Rushikonda: విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టులో విచారణ

High Court takes up hearing on PIL against constructions and digging at Rushikonda in Vizag

  • రుషికొండపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలు
  • నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయంటూ పిల్
  • హైకోర్టులో పిటిషన్ వేసిన వెలగపూడి రామకృష్ణబాబు, మూర్తి యాదవ్
  • విచారణ డిసెంబరు 27కి వాయిదా

విశాఖలోని రుషికొండపై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారని రాజకీయ పక్షాలు గత కొన్నాళ్లుగా ఎలుగెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, రుషికొండ తవ్వకాలు, నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఈ పిల్ వేశారు. 

ఈ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఇవాళ్టి విచారణలో కేంద్ర ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. రుషికొండ పరిస్థితులపై డిసెంబరు మొదటి వారంలో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పంపే బృందం పరిశీలన చేపడుతుందని కేంద్రం తరఫు న్యాయవాది వివరించారు. ఆ బృందం రుషికొండ పరిస్థితులపై నివేదిక రూపొందించి సమర్పిస్తుందని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను డిసెంబరు 27వ తేదీకి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News