YS Bhasker Reddy: కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నా.. బెయిల్ పొడిగించండి: వైఎస్ భాస్కర్ రెడ్డి

YS Bhasker Reddy filed petition for Bail Extention

  • కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన భాస్కర్ రెడ్డి
  • ఎస్కార్ట్ బెయిల్ పొడిగించాలని కోర్టుకు విజ్ఞప్తి
  • ఈ నెల 3న విచారణ చేపడతామన్న న్యాయస్థానం

ఎస్కార్ట్ బెయిల్ పొడిగించాలని కోరుతూ వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో విశ్రాంతి అవసరమని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ పొడిగించాలని కోరారు. వైద్యుల సూచనలు, తదుపరి చికిత్సల దృష్ట్యా మరో రెండు నెలల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఈ నెల 3న విచారించనున్నట్లు పేర్కొంది. కాగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే! ఈ కేసులో అక్టోబర్ 3 (మంగళవారం) వరకు భాస్కర్ రెడ్డికి కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు సమీపిస్తుండడంతో వైఎస్ భాస్కర్ రెడ్డి మరోమారు కోర్టును ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News