Stock Market: స్టాక్ మార్కెట్లకు ఈరోజు కూడా నష్టాలే

Markets ends in losses

  • 221 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 68 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3 శాతం వరకు లాభపడ్డ ఇండస్ ఇండ్ బ్యాంక్

గత వారంలో లాభాల్లో దూసుకుపోయిన మార్కెట్లు ఈ వారం నష్టాలను చవిచూస్తున్నాయి. ఈరోజు కూడా మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 221 పాయింట్లు నష్టపడి 66,009కి పడిపోయింది. నిఫ్టీ 68 పాయింట్లు కోల్పోయి 19,674 వద్ద స్థిరపడింది. కెనడాతో భారత్ కు నెలకొన్న విభేదాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.92%), మారుతి (2.34%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.67%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.52%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.11%). 

టాప్ లూజర్స్:
విప్రో (-2.32%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.57%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.50%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.34%), సన్ ఫార్మా (-1.26%).

  • Loading...

More Telugu News