Team India: నేడు మూడో టీ20... టీమిండియాపై టాస్ గెలిచిన విండీస్

West Indies won the toss in 3rd T20I against Team India

  • టీమిండియా, విండీస్ మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
  • ఇప్పటికే 2-0 ఆధిక్యంలో విండీస్
  • నేటి మ్యాచ్ టీమిండియాకు కీలకం
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్

టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు మూడో 20 మ్యాచ్ జరగనుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ పోరులో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

5 మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన టీమిండియా... ఈ మ్యాచ్ లో గెలిచి రేసులో నిలవాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ మ్యాచ్ లోనూ పరాజయం పాలైతే టీమిండియా సిరీస్ కోల్పోతుంది. 

మరోవైపు సొంతగడ్డపై మినీ ఫార్మాట్లో విండీస్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా, నికోలాస్ పూరన్ భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. పూరన్ ను కట్టడి చేయడంపై టీమిండియా వ్యూహకర్తలు దృష్టి సారించే అవకాశం ఉంది. 

నేటి మ్యాచ్ ద్వారా యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేయనున్నాడు.

Team India
West Indies
Toss
3rd T20I
  • Loading...

More Telugu News