Tirumala: తిరుమల క్షేత్రం కిటకిట... శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

Huge rush in Tirumala town
  • వారాంతం కావడంతో తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
  • నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లు
  • వెలుపలికి వచ్చిన క్యూ లైన్లు
  • నిన్న స్వామివారికి హుండీ ద్వారా రూ.3.88 కోట్ల ఆదాయం
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. వారాంతం కావడంతో భక్తులు తిరుమలకు భారీగా తరలి వస్తున్నారు. రద్దీ పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు తండోపతండాలుగా వస్తుండడంతో క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. 

కాగా, నిన్న తిరుమల వెంకన్నను 71,721 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,078 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శుక్రవారం నాడు హుండీ ద్వారా శ్రీవారికి రూ.3.88 కోట్ల ఆదాయం వచ్చింది.
Tirumala
Devotees
Rush
TTD

More Telugu News