IIT Jee Main: జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల విడుదల.. టాపర్గా హైదరాబాదీ విద్యార్థి

- అడ్వాన్స్డ్కు అర్హత సాధించిన 2.50 లక్షల మంది విద్యార్థులు
- మెయిన్స్ టాపర్గా నిలిచిన హైదరాబాద్ విద్యార్థి వెంకట్ కౌండిన్య
- జూన్ 4న అడ్వాన్స్డ్ పరీక్ష, 18న ఫలితాల విడుదల
జేఈఈ మెయిన్-2023 సెషన్-2 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఈ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం విడుదల చేసింది. ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి
జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్ష జనవరిలో జరిగిన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ 6 నుంచి 15 వరకూ రెండవ సెషన్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన బెస్ట్ స్కోర్ (రెండు సార్లు రాస్తే..) ఆధారంగా ఎన్టీఏ తాజాగా ర్యాంకులు ప్రకటించింది. ఈ మారు మొత్తం 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు.
