Chandranna Kanuka: చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట... ముగ్గురి మృతి

Woman died in Chandranna Kauka distribution program

  • గుంటూరు చంద్రన్న కానుకల పంపిణీ
  • ప్రసంగించి వెళ్లిపోయిన చంద్రబాబు
  • కానుకల కోసం తోసుకుంటూ వచ్చిన జనం
  • తొక్కిసలాట చోటుచేసుకున్న వైనం

ఇవాళ గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీ సభ జరగడం తెలిసిందే. అయితే, చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్రసంగించి వెళ్లిపోయిన తర్వాత అపశృతి చోటుచేసుకుంది. కానుకలు తీసుకునేందుకు జనం భారీగా తరలివచ్చారు. దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట చేసుకోవడంతో ముగ్గురు మృతి చెందారు. ఓ మహిళ సంఘటన స్థలంలోనే మరణించగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. 

సభ వద్ద మరణించిన మహిళను ఏటీ అగ్రహారానికి చెందిన గోపిశెట్టి రమాదేవిగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజ్యలక్ష్మి, సయ్యద్ ఆసిమా ప్రాణాలు విడిచారు.

ఇవాళ గుంటూరు వికాస్ నగర్ లో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రసంగం కొనసాగినంత సేపు సజావుగానే ఉన్న సభ, ఆయన వెళ్లిపోయిన తర్వాత అదుపుతప్పింది. కార్యక్రమ నిర్వాహకులు, టీడీపీ నేతలు పరిస్థితిని నియంత్రించలేకపోయారు. మహిళ మృతి చెందిన నేపథ్యంలో, నిర్వాహకులు చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు.

Chandranna Kanuka
Woman
Death
Chandrababu
Guntur
  • Loading...

More Telugu News