Snake: టీమిండియా బ్యాటింగ్ చేస్తుంటే మైదానంలోకి వచ్చిన పాము... మ్యాచ్ కు అంతరాయం

Snake enters into ground during Team India batting

  • గువాహటిలో ఘటన
  • పామును గుర్తించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు
  • వెంటనే స్పందించిన మైదానం సిబ్బంది
  • తిరిగి కొనసాగిన ఆట

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గువాహటిలో రెండో టీ20 మ్యాచ్ లో పాము కలకలం చెలరేగింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా మైదానంలోకి పాము వచ్చింది. ఫీల్డింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఈ పామును గుర్తించారు. బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ కు ఆ పామును చూపించారు. అనంతరం, అంపైర్లను అప్రమత్తం చేశారు. 

దీనిపై వెంటనే స్పందించిన మైదానం సిబ్బంది తగిన పరికరాలతో గ్రౌండ్ లోకి వచ్చి పామును చాకచక్యంగా పట్టుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అప్పటికి టీమిండియా 7 ఓవర్లలో 68 పరుగులతో ఆడుతోంది. 

కాగా, దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేసే సమయంలోనూ మ్యాచ్ నిలిచిపోయింది. ఫ్లడ్ లైట్లలో ఒక టవర్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో మైదానంలో తగినంత వెలుగు కనిపించలేదు. కాసేపటి తర్వాత ఆ టవర్ ను పునరుద్ధరించడంతో మ్యాచ్ కొనసాగింది.

  • Loading...

More Telugu News