Telangana: తెలంగాణలో మరో 376 మందికి కరోనా పాజిటివ్

Telangana corona report

  • ఓ మోస్తరు స్థాయిలో కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 26,558 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 164 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 406 మంది
  • ఇంకా 2,722 మందికి చికిత్స

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఓ మోస్తరు స్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 26,558 కరోనా పరీక్షలు నిర్వహించగా, 376 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 164 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 33, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 26 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 406 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మరణాలేవీ నమోదు కాలేదు. 

ఇక తెలంగాణలో ఇప్పటిదాకా 8,32,595 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,25,762 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,722 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.

Telangana
Corona Virus
New Cases
Media Report
  • Loading...

More Telugu News