Karimnagar District: ప్రభుత్వ బడిలో చేరే పిల్లలకు నెలకు రూ. 500.. పుస్తకాలు, దుస్తుల ఖర్చు కూడా నాదే.. ఓ సర్పంచ్ హామీ

Rs 500 Incentive for children who joins in govt school

  • పిల్లలకు ప్రోత్సాహకంగా ప్రతి నెల రూ. 500 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సర్పంచ్ శారద
  • బడిబాటలో భాగంగా 50 మందిని చేర్పించాలని లక్ష్యం
  • హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ సర్పంచ్‌గా ఉన్న శారద

ప్రభుత్వ స్కూళ్లకు మళ్లీ ఆదరణ పెంచేందుకు, వాటికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రైవేటు స్కూళ్లవైపే తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు నీరసించిపోతోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ సర్పంచ్ కొడగూటి శారద తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

ఈ రెండు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లలకు నెలకు రూ. 500 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వడంతోపాటు వారి దుస్తులు, పుస్తకాలకు అయ్యే ఖర్చును కూడా భరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ రెండు గ్రామాల్లోని పాఠశాలల్లో ప్రస్తుతం 70 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కనీసం మరో 50 మందిని చేర్పించాలని నిర్ణయించుకున్నట్టు సర్పంచ్ శారద తెలిపారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News