త్వరలో అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమిస్తాం: నాగబాబు
- జూన్ 1 నుంచి ఉత్తరాంధ్రలో నాగబాబు పర్యటన
- పార్టీ శ్రేణులతో సమావేశాలు
- పొత్తులపై పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడి
- సంక్షేమ పాలన అంటూ దోపిడీ చేస్తున్నారని విమర్శలు
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పొత్తులపై పవన్ కల్యాణ్ దే తుది నిర్ణయం అని నాగబాబు స్పష్టం చేశారు. త్వరలోనే పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్నారని, పార్టీ నేతలతో విస్తృతంగా సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ పాలన పేరిట నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.