Sachin Tendulkar: సచిన్ ఐపీఎల్ జట్టులో కోహ్లీ, రోహిత్ శర్మలకు దక్కని స్థానం.. ఆయన తుది జట్టులోని ఆటగాళ్లు వీళ్లే!

Kohli and Rohit Sharma not in Sachin Tendulkar IPL 2022 team

  • ఐపీఎల్ 2022 జట్టును ఎంపిక చేసిన సచిన్
  • అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా జట్టును ఎంపిక చేశానన్న టెండూల్కర్
  • సచిన్ జట్టు కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యా

ఈ సీజన్ ఐపీఎల్ టోర్నీ ముగిసింది. హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు విజేతగా నిలిచింది. మరోవైపు ఐపీఎల్ 2022లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన బెస్ట్ ఎలెవెన్ టీమ్ ను ప్రకటించాడు. సచిన్ టీమ్ లో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు స్థానం దక్కలేదు. ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యుత్తమ ప్రదర్శన ఆధారంగానే జట్టును ఎంపిక చేశానని సచిన్ తెలిపారు. 

సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ 2022 జట్టు ఇదే:
జోస్ బట్లర్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, లివింగ్ స్టోన్, దినేశ్ కార్తీక్, రషీద్ ఖాన్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చాహల్.

  • Loading...

More Telugu News