Air India: గాల్లో ఉండగానే పనిచేయడం మానేసిన ఇంజిన్.. ముంబైలో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్

Air India Made Emergency Landing After Airbus Engine Shut Mid Air

  • ముంబై నుంచి బెంగళూరు బయలుదేరిన విమానం
  • విమానంలోని రెండు ఇంజిన్లలో ఒకటి ఆగిపోయిన వైనం
  • తిరిగి ముంబైకి తరలించి సేఫ్ ల్యాండింగ్
  • మరో విమానంలో ప్రయాణికులను బెంగళూరు తరలించిన ఎయిర్  ఇండియా
  • విచారణ ప్రారంభించిన డీజీసీఏ 

ముంబై నుంచి బెంగళూరు బయలుదేరిన ఎయిరిండియా విమానం పెను ప్రమాదం నుంచి బయటపడింది. గగనతలంలో ఉండగానే విమానంలోని ఒక ఇంజిన్ ఆగిపోవడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబై విమానాశ్రయంలో సేఫ్ ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణ ప్రారంభించింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 నియో విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం ఉదయం 9.43గంటలకు బెంగళూరు బయలుదేరింది. 

రెండు సీఎఫ్ఎం ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో ఒకటి గగనతలంలో ఉండగానే మొరాయించింది. ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడాన్ని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని ముంబై మళ్లించి 10.10 గంటలకు ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ప్రయాణికులను మరో విమానంలో బెంగళూరుకు తరలించారు.

  • Loading...

More Telugu News