బ్రెజిల్లో వరదలు.. 94 మంది మృతి.. పదుల సంఖ్యలో గల్లంతు
- వరదలతో పెట్రోపోలిస్ నగరం అతలాకుతలం
- మట్టి చరియల కింద మరింత మృతదేహాలు
- మూడు గంటల్లోనే 25.8 సెంటీమీటర్ల వర్షపాతం
- 1932 తర్వాత ఇదే తొలిసారి
మట్టిచరియల కింద మరికొన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తమ వారి కోసం గాలిస్తున్న వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఈ ప్రాంతం విషాదంగా మారింది. మూడు గంటల్లోనే ఏకంగా 25.8 సెంటీమీటర్ల వర్షం కురవడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. 1932 తర్వాత ఈ స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. వరద ప్రవాహం ఇంకా తగ్గలేదు. వీధుల్లో కార్లు గుట్టలుగా పడివున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.