బుజ్జగింపులు.. విజయశాంతి ఇంటికి వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి

Manickam Tagore went to Vijayashanti home
  • విజయశాంతి కాంగ్రెస్ ను వీడుతున్నారనే ప్రచారం
  • ఆమెతో చర్చించిన మాణిక్యం ఠాగూర్
  • తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేసిన విజయశాంతి
ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పార్టీని వీడుతున్నారనే ప్రచారం కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో, ఆమెను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు.

ఇందులో భాగంగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ ఈరోజు విజయశాంతి నివాసానికి వెళ్లారు. ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆమెతో చాలా సేపు చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాలను మాణిక్యంకు విజయశాంతి వివరించారు. తన తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీ కూడా అనుమతి ఇచ్చారని... అయినా రాష్ట్ర నేతలు అడ్డుకున్నారని తెలిపారు.
Go Back to Shorts
Vijayashanti
Manickam Tagore
Congress

More Telugu News