India abroad: అమెరికాలో ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన భారతీయ పత్రిక మూసివేత!

Indian news paper print edition closed in Amrica

  • ‘ఇండియా అబ్రాడ్’ పేరుతో వస్తున్న పత్రిక
  • 1970లో స్థాపించిన గోపాల్ రాజ్
  • ఆ తర్వాత చేతులు మారిన వైనం

ఓ వైపు కరోనా కల్లోలం, మరోవైపు ప్రకటనలు లేకపోవడంతో అమెరికాలో 5 దశాబ్దాల చరిత్ర కలిగిన భారతీయ పత్రిక ప్రింట్ ఎడిషన్ మూతపడింది. ప్రవాస భారతీయుడైన గోపాల్ రాజ్ 1970లో ‘ఇండియా అబ్రాడ్’ పేరుతో పత్రికను స్థాపించారు. అమెరికాలోని భారతీయుల మన్ననలు అందుకున్న ఈ పత్రిక రాజకీయం, సాంకేతికత, సాహిత్యం వంటి రంగాల్లో విస్తృతంగా వార్తలు అందిస్తోంది.

2011లో రిడిఫ్ డాట్ కామ్ ఈ పత్రికను కొనుగోలు చేయగా, 2016లో ‘8కే మైల్స్ మీడియా ఇంక్’ ఈ పత్రికపై యాజమాన్య హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా, కరోనా వైరస్ అమెరికాను భయపెడుతుండడంతోపాటు ప్రకటనలు లేకపోవడంతో నిర్వహణ ఖర్చు భారమైంది. దీంతో ప్రింట్ ఎడిషన్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించిన యాజమాన్యం.. వెబ్ ఎడిషన్ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

India abroad
america
Corona Virus
  • Loading...

More Telugu News