India: సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. టెస్టుల్లో 26వ శతకం నమోదు 

  • అద్భుతమైన స్ట్రయిట్ డ్రైవ్ తో సెంచరీ పూర్తిచేసిన కోహ్లీ
  • 2019లో తొలి టెస్ట్ సెంచరీ నమోదు
  • 58 పరుగులతో కోహ్లీకి అండగా ఉన్న రహానే
దక్షిణాఫ్రికాతో పూణేలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సత్తా చాటాడు. తన టెస్ట్ కెరీర్ లో 26వ శతకాన్ని బాదాడు. అద్భుతమైన స్ట్రయిట్ డ్రైవ్ తో 2019లో తన తొలి టెస్ట్ సెంచరీని పూర్తిచేశాడు.

మరో ఎండ్ లో అజింక్యా రహానే నిలకడగా ఆడుతూ కోహ్లీకి అండగా నిలిచాడు. భోజన విరామ సమయానికి భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 356 పరుగులు. కోహ్లీ 104 పరుగులతో, రహానే 58 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీనికి ముందు మయాంక్ 108, రోహిత్ శర్మ 14, పుజారా 58 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు వికెట్లను రబాడా తీశాడు. కోహ్లీ, రహానేల జోరుతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
India
South Africa
Test Match
Pune
Score
Virat Kohli

More Telugu News