కంప్యూటర్లలో నిల్వచేసే డేటా తనిఖీ ఆదేశాలపై స్పందించిన సుప్రీంకోర్టు
- నిఘా సంస్థల అధికారాలను పరిశీలిస్తామని వెల్లడి
- గత ఏడాది డిసెంబరు 20న కేంద్రం ఆదేశం
- దీనిపై కోర్టును ఆశ్రయించిన పలు సంస్థలు
వివరాల్లోకి వెళితే...కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్న డేటాపై నిఘా పెట్టడానికి పది కేంద్ర సంస్థలకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల కంప్యూటర్ వ్యవస్థలోని ఎలాంటి డేటానైనా ఇంటర్సెప్ట్ చేసేందుకు, పర్యవేక్షించేందుకు, డీక్రిప్ట్ చేసేందుకు ఈ సంస్థలకు అధికారం కలుగుతుంది. దీంతో కేంద్రం ఆదేశాలను సవాల్ చేస్తూ పలు సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కేంద్రం ఆదేశాలు వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనంటూ సదరు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ పిటిషన్పై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది.