అసలు వాజ్ పేయి మృతి చెందింది ఎప్పుడు? 16కు ముందేనా?: శివసేన
- వాజ్ పేయి ఆరోగ్యం అంతకుముందే క్షీణించింది
- మోదీ ప్రసంగానికి ఇబ్బందులు లేకుండా చూసేందుకేనా?
- 'సామ్నా' సంపాదకీయంలో సంచలన వ్యాఖ్యలు
ఆయన ఆరోగ్యం అప్పటికి నాలుగైదు రోజుల ముందు నుంచే తీవ్రంగా విషమించిందని గుర్తు చేసిన 'సామ్నా', ఉత్సాహంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే, దేశంలో సంతాపదినాలు, జెండాల అవనతం లేకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని కూడా అడిగింది. 'స్వరాజ్యమంటే ఏంటి?' అన్న శీర్షికతో సంపాదకీయం రాసిన ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్, మోదీ సుదీర్ఘమైన ప్రసంగానికి అడ్డంకులు లేకుండా చూసేందుకు వాజ్ పేయి మృతిని 16న ప్రకటించారన్న అనుమానాలు వ్యక్తం చేశారు.