mumbai: భారత్ పెట్రోలియం రిఫైనరీ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురికి గాయాలు

  • ముంబయిలోని చంబూర్ ప్రాంతంలో ప్రమాదం
  • 43 మందికి గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం
  • స్థానిక ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు

ముంబయిలోని భారత్ పెట్రోలియంకు చెందిన రిఫైనరీ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 43 మంది గాయపడగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ముంబయిలోని చంబూర్ ప్రాంతంలో ఉన్న ఈ రిఫైనరీ ప్లాంట్ లో ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలానికి  ఏడు అగ్నిమాపక వాహనాలు, రెండు భారీ ట్యాంకర్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

  • Loading...

More Telugu News