కోహ్లీ కనిపించినా మాట్లాడలేకపోయాను: మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్
- దక్షిణాఫ్రికా ఎయిర్పోర్ట్లో ఈ సంఘటన జరిగిందని వెల్లడి
- ప్రతిభ కన్నా క్రమశిక్షణే ఆటగాళ్లను స్టార్గా మారుస్తుందని వ్యాఖ్య
- టీ20 ప్రపంచకప్లో భారత జట్టు గెలవాలని ఆకాంక్ష
"గతంలో దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు విమానాశ్రయంలో విరాట్ కోహ్లీ నాకు కనిపించాడు. అయితే, అతడు తన పనుల్లో నిమగ్నమై ఉండటం, మరోవైపు నాకు కూడా కొంత కంగారుగా అనిపించడంతో పలకరించలేకపోయాను" అని పూజా తెలిపింది. 25 ఏళ్ల వస్త్రాకర్ ప్రస్తుతం ఉమెన్స్ ఎంపీఎల్ టీ20లో చంబల్ ఘరియాల్స్ జట్టుకు సారథ్యం వహిస్తోంది.
జాతీయ క్రికెట్ అకాడమిలో అత్యాధునిక వసతులు, నిపుణులైన కోచ్లు, సీనియర్ల మార్గదర్శకత్వం అందుబాటులో ఉన్నందున, వెలుపలి వారి సలహాలు తీసుకోవాల్సిన అవసరం రాలేదని ఆమె స్పష్టం చేసింది. ప్రతిభ, కష్టపడే తత్వం చాలా మందిలో ఉన్నప్పటికీ, క్రమశిక్షణ ఒక సామాన్య క్రీడాకారుడిని అసాధారణ స్టార్గా మారుస్తుందని వస్త్రాకర్ అభిప్రాయపడింది.
కాగా, త్వరలో ప్రారంభమయ్యే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేసిన భారత జట్టులో పూజా వస్త్రాకర్ కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో, ఆమె మాట్లాడుతూ, టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోందని ఆమె ప్రశంసించింది. గతంలో వన్డే ప్రపంచకప్ సాధించిన స్ఫూర్తితో, ఈ టీ20 ప్రపంచకప్ టైటిల్ను కూడా భారత్ ముద్దాడాలని తన సహచర క్రీడాకారిణులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేసింది.