4, 4, 4.. ఆ తర్వాత ఔట్.. శ్రీలంక బౌలర్కు చిక్కిన వైభవ్ సూర్యవంశీ!
ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్లో వైభవ్ విఫలం
వరుసగా మూడు ఫోర్లు బాదిన సూర్యవంశీ
నాలుగో ఓవర్లో పెవిలియన్ చేరిన యువ సంచలనం
లంక బౌలర్ షిరాజ్ బౌలింగ్లో ఔట్
12 పరుగులకే ముగిసిన వైభవ్ ఇన్నింగ్స్
వరుసగా మూడు ఫోర్లు బాదిన సూర్యవంశీ
నాలుగో ఓవర్లో పెవిలియన్ చేరిన యువ సంచలనం
లంక బౌలర్ షిరాజ్ బౌలింగ్లో ఔట్
12 పరుగులకే ముగిసిన వైభవ్ ఇన్నింగ్స్
రెండో ఓవర్లోనే రెండు ఫోర్లతో ఖాతా తెరిచిన వైభవ్, మూడో ఓవర్ మొదటి బంతికే మరో ఫోర్ కొట్టి క్రీజ్లో నిలదొక్కుకున్నట్లు కనిపించాడు. అయితే లంక బౌలర్ మహ్మద్ షిరాజ్ వేసిన ఫుల్లర్ లెంగ్త్ బంతిని భారీ షాట్ ఆడబోగా బ్యాట్ చేతిలో తిరగడంతో మిడ్-ఆఫ్ ఫీల్డర్ డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో కేవలం 12 పరుగులకే వైభవ్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారీ ఆశలతో బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టుకు గట్టి షాక్ తగిలింది.
ఇటీవలే భారత సీనియర్ టీ20 జట్టుకు ఎంపికైన వైభవ్కు లంకలోని నెమ్మది పిచ్లపై ఆడటం ఒక సవాల్ అని ఇండియా-ఏ కెప్టెన్ తిలక్ వర్మ మ్యాచ్కు ముందు పేర్కొన్నాడు. ఈ ఏడాది జరిగిన అండర్-19 వరల్డ్ కప్లో భారత్ విజేతగా నిలవడంలో వైభవ్ వన్డే ఫార్మాట్లో అద్భుతంగా రాణించాడని గుర్తుచేశాడు. ఈ సిరీస్లో భారత్, శ్రీలంకతో పాటు ఆఫ్ఘనిస్థాన్ కూడా ఆడుతోంది. రాబోయే మ్యాచ్ల్లో వైభవ్ కచ్చితంగా పుంజుకుంటాడని జట్టు యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.