సినిమా మారాల్సిన సమయం వచ్చేసింది.. హీరోల రెమ్యూనరేషన్లపై కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు
- నటీనటుల అధిక ఫీజుల అంశంపై స్పందించిన కంగనా రనౌత్
- సినిమా ఆడనప్పుడు పెట్టిన ప్రతి ఖర్చూ ఎక్కువే అనిపిస్తుందని వ్యాఖ్య
- మారుతున్న సమాజానికి అనుగుణంగా సినిమా కూడా అభివృద్ధి చెందాలని సూచన
- ప్రేక్షకులు తమను తాము చూసుకునే కథలు రావాలన్న నటి స్మితా తాంబే
- ఈ నెల 12న కంగనా కీలక పాత్రలో 'భారత్ భాగ్య విధాత' విడుదల
"ఆదాయం తగ్గినప్పుడు ఇంట్లో ఖర్చులు ఎలాగైతే తగ్గించుకుంటామో, అలాగే సినిమా పరిశ్రమ కూడా మారాలి. ప్రేక్షకుల అభిరుచులు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి" అని కంగనా వివరించారు.
ఇదే కార్యక్రమంలో 'భారత్ భాగ్య విధాత' చిత్రంలో కంగనాతో కలిసి నటించిన స్మితా తాంబే మాట్లాడుతూ.. "ప్రేక్షకులు ప్రతి కథలోనూ తమ ఉనికిని, తమ జీవితానికి దగ్గరగా ఉండే అంశాలను వెతుక్కుంటారు. సామాన్య ప్రేక్షకులకు, సినిమా కథలకు మధ్య సంబంధం ఎంతగా పెరిగితే, వారిని అంతగా ఆకట్టుకోగలం" అని తెలిపారు.
కాగా, కంగనా రనౌత్ కీలక పాత్రలో నటించిన 'భారత్ భాగ్య విధాత' చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఓ తీవ్రవాద దాడి సమయంలో కామా ఆసుపత్రిలో వందల ప్రాణాలను కాపాడిన సామాన్యుల నిజ జీవిత స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించారు.