శిరిడీ సాయిబాబా జన్మస్థల వివాదంపై మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు
- పథ్రీ అంశం భక్తుల నమ్మకాలపై ఆధారపడి ఉంది
- రూ.100 కోట్లు కేటాయించినంత మాత్రాన కంగారుపడాల్సిన అవసరం లేదు
- ఉద్ధవ్ చర్చలకు రమ్మని ఇప్పటికే ఆహ్వానించారు
- జన్మస్థలం ఎక్కడ ఉన్న శిరిడీ బాబాగానే అందరికీ ఆయన సుపరిచితం
ఇప్పటికే ఈ విషయంపై ఉద్ధవ్ చర్చలకు రమ్మని ఆహ్వానించారని, శిరిడీ ట్రస్ట్ సభ్యులు అక్కడికి వెళ్లి చర్చించాలని మురళీ మోహన్ అన్నారు. ఈ అంశాన్ని అనవసరంగా తీవ్రతరం చేయవద్దని ఆయన కోరారు. సాయినాథుడి భక్తుల మనోభావాలను కించపర్చవద్దని ఆయన అన్నారు. సాయిబాబా జన్మస్థలం ఎక్కడ ఉన్నా, బాబా ఎక్కడ పెరిగినా శిరిడీ బాబాగానే అందరికీ ఆయన సుపరిచుతులని మురళీ మోహన్ అన్నారు.