చట్టాల ద్వారానే మార్పు రాదు, అందరూ బాధ్యతగా ఉండాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- అత్యాచార ఘటనలపై వెంకయ్యనాయుడి ఆవేదన
- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు
- కీచకుల్లో మార్పు రావాలే తప్ప కొత్త చట్టాలతో ప్రయోజనం ఉండదు
చట్టాల ద్వారానే మార్పు రాదని, సమాజంలో మార్పు కోసం అందరూ బాధ్యతగా ఉండాలని సూచించారు. సమాజంలో విలువలు వుంటే దిశ లాంటి ఘటనలకు ఆస్కారం వుండదని అన్నారు. దిశ లాంటి ఘటనల్లో వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించారు. కీచకుల్లో మార్పు రావాలే తప్ప వారిని కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాలు తీసుకొచ్చిన ప్రయోజనం వుండదని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి గురించి ఆయన మాట్లాడారు. మన సంస్కృతిని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయని, సంస్కృతిని కాపాడుకుంటే మంచి నడవడిక అలవడుతుందని అన్నారు.