కాచిగూడ స్టేషన్ లో పూర్తిగా నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు
- కాచిగూడలో రైలు ప్రమాదం
- సిగ్నలింగ్ లోపంతో మరో ట్రాక్ పైకి వెళ్లిన ఎంఎంటీఎస్ రైలు
- రైలు వేగం తక్కువగా ఉండటంతో తప్పిన ఘోర ప్రమాదం
ఈ ఘటనలో ఎంఎంటీఎస్ కు చెందిన మూడు బోగీలు ధ్వంసమయ్యాయి. మరో ఆరు బోగీలు పక్క ఉన్న పట్టాలపై పడిపోయాయి. ఎంఎంటీఎస్ రైలు తక్కువ వేగంగా ప్రయాణిస్తుండటంతో భారీ ప్రమాదం తప్పింది. రైలు వేగంగా ప్రయాణించి ఉంటే ఎంతో మంది దుర్మరణం పాలయ్యే అవకాశం ఉండేది. మరోవైపు ఈ ప్రమాదం నేపథ్యంలో, కాచిగూడలో రైళ్ల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపి వేశారు.