అయోధ్య తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ స్పందన
- మాకు రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉంది
- మా హక్కులపై పోరాటం చేశాం
- విరాళంగా మాకు ఐదు ఎకరాల భూమి అవసరం లేదు
ఈ తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తిగా ఉందని ఒవైసీ తెలిపారు. తాము 5 ఎకరాల భూమి కోసం కాదు, న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రివ్యూ పిటిషన్ వేయాలా? అనే విషయాన్ని పర్సనల్ లా బోర్డు నిర్ణయిస్తుందని అన్నారు. తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటనను సమర్థిస్తున్నానని తెలిపారు.
కాగా, అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి, ఆ స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో 'అయోధ్య ట్రస్ట్'ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇక ముస్లింలకు అయోధ్యలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలని కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే.