శ్రీశైలానికి భారీగా తగ్గుతున్న వరద!
- మూసుకుపోయిన ఆల్మట్టి గేట్లు
- కర్ణాటకలో ఆగిన వర్షాలు
- నాలుగు గేట్లను మాత్రమే తెరచివుంచిన అధికారులు
జలాశయానికి 215 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉండగా, 214.3637 టీఎంసీల నీరుందని, 885 అడుగుల నీటిమట్టానికి గాను, 884.80 అడుగుల నీరుందని తెలిపారు. రెండు జలవిద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నామన్నారు. కాగా, వస్తున్న వరద నీటిని బట్టి నాగార్జున సాగర్ గేట్లను మూసివేయడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.