దాడులకు పాల్పడుతున్నారంటూ అనంతపురం వైసీపీ నేతలపై టీడీపీ ఫిర్యాదు
- అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
- ఎస్పీని కలిసిన పార్ధసారథి, పరిటాల, కాలువ
- వైసీపీ నాయకులు గ్రామాల్లో రెచ్చగొడుతున్నారు
అనంతరం, మీడియాతో కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ, వైసీపీ నాయకులు గ్రామాల్లో రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పరిటాల సునీత మాట్లాడుతూ, తన భర్త పరిటాల రవీంద్ర ట్రస్టు నిర్మించిన వాటర్ ప్లాంట్లను వైసీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం, అకారణంగా దాడులు చేయడంపై ఆమె మండిపడ్డారు.