టిప్పు సుల్తాన్ కు నివాళులు అర్పించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- ఆయన నా ఆరాధ్య పాలకుడు
- బానిసత్వం కంటే వీరమరణమే నయమనుకున్నారు
- ట్వీట్ చేసిన ఇమ్రాన్
టిప్పు సుల్తాన్ గురించి పాక్ ప్రధాని మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం జరిగిన పార్లమెంటరీ సంయుక్త సమావేశంలో కూడా ఆయన టిప్పు సుల్తాన్ గురించి ప్రస్తావించారు. ఆంగ్లేయులతో జరిగిన యుద్ధంలో శ్రీరంగపట్నం వద్ద టిప్పు వీరమరణం పొందారు.
అయితే, పారిపోవడానికి తాము సహకరిస్తామంటూ ఫ్రెంచి వలస పాలకులు ప్రతిపాదన చేసినా టిప్పు నిరాకరించారు. వెయ్యేళ్లు ఓ పిరికి గొర్రెలా బతకడం కంటే ఒక్కరోజు పులిలా బతికినా చాలు అంటూ ధైర్యంగా యుద్ధాన్ని కొనసాగించారు. ఈ మాటలనే ఇమ్రాన్ ఖాన్ పుల్వామా దాడి అనంతరం స్మరించుకున్నారు.