గత్యంతరం లేకనే మోదీ ఈ పని చేశారు: బొత్స ఎద్దేవా
- బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి
- అందుకే రైల్వే జోన్ ను హడావుడిగా ప్రకటించారు
- మరింత ముందుగా ప్రకటిస్తే బాగుండేదన్న బొత్స
వాల్తేరు డివిజన్ ఇండియాలోనే అత్యధికంగా ఆదాయాన్ని తీసుకువచ్చే డివిజన్లలో ఒకటని, దాన్ని విభజించడం తమకు నచ్చలేదని అన్నారు. వాల్తేరు డివిజన్ ను అలాగే ఉంచేస్తే ప్రజలు మరింతగా హర్షించేవారని, అరకొరగా విశాఖ జోన్ ను ప్రకటించారని విమర్శించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ ఈపని చేసిందని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు.