జనగామ జిల్లాలో రైలు ప్రమాదం... నాగపూర్ లో లభ్యమైన తల!
- రఘునాధపల్లి వద్ద లభ్యమైన మొండెం
- 400 కిలోమీటర్ల దూరంలో రైలు బోగీకి తల
- మృతుడెవరో తెలియదంటున్న పోలీసులు
ఇక సోమవారం నాడు, నాగపుర్ రైల్వే స్టేషన్ లో రైలు బోగీ మెట్లకు ఓ తల చిక్కుకుని ఉన్న విషయాన్ని గమనించిన అక్కడి పోలీసులు, ఇది హత్యా? లేక ప్రమాదమా? అన్న కోణంలో దర్యాఫ్తు ప్రారంభించి, ఆ రైలు ప్రయాణించిన మార్గంలోని అన్ని స్టేషన్లనూ అప్రమత్తం చేయగా, ఇక్కడి పోలీసులు స్పందించారు. తలకు అతుక్కుని ఉన్న బనియన్ ముక్కలు, మృతుడు ధరించిన బనియన్ ఒకటేనని గుర్తించి, ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా తేల్చారు. తలను తెచ్చి మొండేనికి అతికించి, అతను ఎవరన్న విషయాన్ని తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి మృతుడికి సంబంధించిన వివరాలేవీ తెలియరాలేదని కాజీపేట పోలీసులు వెల్లడించారు.