కర్ణాటకలో 'ఆపరేషన్ లోటస్' విజయవంతమవుతుంది: బీజేపీ
- కర్ణాటలో కమలం వికసిస్తుందన్న రామ్ షిండే
- ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్లు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు
- బీజేపీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు
కర్ణాటకలో ఆపరేషన్ లోటస్ విజయవంతమవుతుందని షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ పాలిస్తున్న దక్షిణాది రాష్ట్రంలో త్వరలోనే కమలం వికసించబోతోందని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వానికి ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతును ఉపసంహరించుకున్నారని... ప్రజలు పట్టం కట్టిన బీజేపీకే మద్దతివ్వాలని వారు అనుకుంటున్నారని తెలిపారు.