‘ఫేస్ బుక్’ ఖాతాను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- ‘ఫేస్ బుక్’లో పవన్ అధికారిక పేజీ ప్రారంభం
- యువతకు, ప్రజలకు మరింత చేరువవుతున్నాం
- నవంబర్ 2 న విజయవాడ - తునికి రైలులో పవన్ ప్రయాణం

'సేనానితో రైలు ప్రయాణం'
జన్మభూమి రైలులో 'సేనానితో రైలు ప్రయాణం' పేరుతో పవన్ కల్యాణ్ ప్రయాణించనున్నారని జనసేన పార్టీ పేర్కొంది. ఈ ప్రయాణంలో పలు వర్గాల ప్రతినిధులు పవన్ కళ్యాణ్ తో మాట్లాడతారని పేర్కొంది. విజయవాడ నుంచి తుని చేరుకొనే వరకూ పలు వర్గాల ప్రజలతో మాటామంతీ ఉంటుందని, మధ్యాహ్నం 1.20 గంటలకు రైల్వే పోర్టర్లతో మాట్లాడతారని తెలిపింది. ఆ తర్వాత మామిడి రైతులు, అసంఘటిత రంగంలో ఉన్న చిరు వ్యాపారులు, రైల్వే వెండర్లతో పాటు, రైలులోని ప్రయాణికులు, చెరకు రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, ఏటికొప్పాక బొమ్మల తయారీ కళాకారులతో ఈ ప్రయాణంలో పవన్ మాట్లాడతారని పేర్కొంది.