హతవిధీ.. భారత్ను ఇరికించబోయి బొక్కబోర్లా పడిన పాకిస్థాన్!
- భారత్కు వ్యతిరేకంగా 20 స్టాంపులు ముద్రించిన పాక్
- తమకు వ్యతిరేకంగా కశ్మీరీ పండిట్లు చేసిన ఆందోళనను కూడా ముద్రించిన వైనం
- ఐరాస దృష్టికి తీసుకెళ్లిన ‘రూట్స్ ఇన్ కశ్మీర్’
అయితే, పొరపాటున పాకిస్థాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కశ్మీర్ పండిట్లు ఆందోళన చేస్తున్న ఫొటోలను కూడా స్టాంపుల్లో ముద్రించింది. దీనిపై కశ్మీర్ త్వరలోనే పాకిస్థాన్ అవుతుంది అని ఉర్దూలో రాసుకొచ్చింది. ఈ పోస్టల్ స్టాంపు చూసిన రూట్స్ ఇన్ కశ్మీర్ (ఆర్ఐకే) అనే సంస్థ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్కు లేఖ రాసింది.
పాకిస్థాన్ స్పాన్సర్డ్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కశ్మీర్ పండిట్లు చేస్తున్న ఆందోళనను పాకిస్థాన్ తన స్టాంపులపై ముద్రించుకుందని, ఇప్పటికైనా పాక్ దురాగతాలను గుర్తించాలని కోరింది. ఆరేడేళ్ల క్రితం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కశ్మీర్ పండిట్లు పాకిస్థాన్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నప్పటి ఫొటో అదని ఐరాసకు రాసిన లేఖలో పేర్కొంది.
ఈ విషయంలో కలుగజేసుకుని పాకిస్థాన్ ఆ స్టాంపులను ఉపసంహరించుకునేలా ఆదేశించడంతోపాటు కశ్మీరీ పండిట్లకు క్షమాపణ చెప్పించాలని ఆర్ఐకే డిమాండ్ చేసింది.