ప్రబోధానంద స్వామిపై కేసు పెట్టిన టీడీపీ నేత!
- హిందూ దేవుళ్లను అవమానించారని మధుసూదన్ రావు ఫిర్యాదు
- కేసు నమోదుచేసిన గుత్తి పోలీసులు
- రసవత్తరంగా మారుతున్న తాడిపత్రి రాజకీయం
ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసును నమోదుచేశారు. మరోవైపు ప్రబోధానంద గత మూడేళ్లుగా ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదని చెబుతున్నారు. కేవలం పౌర్ణమి రోజున.. అదీ ఎల్ సీడీ స్క్రీన్ల ద్వారా మాత్రమే ఆయన ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఇటీవల తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామస్తులు, ప్రబోధానంద ఆశ్రమం వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా దాదాపు 45 మంది గాయపడ్డారు.