చంద్రబాబుకు నా సలహా ఇదొక్కటే... దయచేసి వినండి!: వైఎస్ జగన్
- 21న వైకాపా అవిశ్వాసం
- చంద్రబాబు సహకరించాలి
- లేకుంటే టీడీపీ అవిశ్వాసం పెడితే మేం వెంట నిలుస్తాం
- మీడియాతో వైఎస్ జగన్
చంద్రబాబు ఓకే అంటే, అంతకన్నా ముందైనా అవిశ్వాసం పెట్టడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. "నన్ను పెట్టమంటే నే పెడతా. 25కి 25 మంది ఎంపీలూ ఒకతాటిపై నిలబడదాం. అవిశ్వాసం పెడదాం. మేం అవిశ్వాసం పెడతాం నువ్వు మద్దతివ్వు. లేదంటే నువ్వు పెట్టు మేం ఇస్తాం. దాని తరువాత 25 మంది ఎంపీలతోనూ మూకుమ్మడిగా రాజీనామా చేయిద్దాం. అప్పుడు దేశమంతా చర్చ జరుగుతుంది. ఎందుకు ఆంధ్రరాష్ట్రం ఇలా చేస్తోందని ఆలోచిస్తుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదు. చంద్రబాబుకు నా సలహా ఇదొక్కటే" అని అన్నారు. తన సలహాను ఆయన వినాలని కోరారు.