కూరగాయలు, పండ్లను ఎలా తీసుకోవాలి...? బరువు తగ్గేందుకు ఏ విధంగా వాడాలి?
18-11-2017 Sat 13:38

పండ్లు, కూరగాయల నుంచి రసం తీసుకుని తాగే అలవాటు చాలా మందిలో కనిపిస్తుంది. అయితే, పండ్లు, కూరగాయల్లో వేటిలో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నది తెలిసింది తక్కువ మందికే. అందుకే, దీని ద్వారా ఆ విషయాలు తెలుసుకుందాం.
ద్రవ పదార్థాలు (రసాలు) అన్నవి మన శరీరానికి ఎంతో అవసరం. ఇవి శరీరంలో పేరుకుని పోయిన వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. జీర్ణవ్యవస్థకు కాస్తంత విరామాన్ని ఇస్తాయి. పేగులను శుభ్రం చేసేందుకు ఇవి అవసరం. పండ్ల రసాలైనా, కూరగాయల రసాలైనా మన శరీరానికి శక్తినిచ్చేవే. ఓ గ్లాసుడు ఆరెంజ్ జ్యూస్ తో విటమిన్-సి కావాల్సినంత లభిస్తుంది. అలాగే, కీరదోస, పాలకూర జ్యూస్ మనలోని వ్యర్థాలను పోగొట్టి, తాజాదనం అందిస్తాయి. యాపిల్, బీట్ రూట్, క్యారట్ జ్యూస్ కలిపి తాగితే బరువు తగ్గుతారు.
90/10

తాజా పండ్లలో, కూరగాయల్లో తగినన్ని పోషకాలుంటాయి. అయితే, పోషక ప్రయోజనాలు కాస్తంత కూరగాయల్లోనే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. పండ్ల రసాల్లో మంచి పోషకాలతోపాటు చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఒకేసారి పండ్లను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం అన్నది సాధ్యపడదు. కాకపోతే పండ్ల రసం రూపంలో తీసుకోవచ్చు. అదే కూరగాయల్లో అయితే చక్కెరల శాతం చాలా తక్కువ. పండ్లతో పోల్చి చూస్తే కేలరీలు కూడా తక్కువే. పోషకాలు మాత్రం పుష్కలంగా లభిస్తాయి.
కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి...

జర్నల్ అపెటైట్ లో ప్రచురితమైన పరిశోధనా కథనం మేరకు... పరిశోధకులు పండ్లను వివిధ రూపాల్లో ఇచ్చి చూశారు. యాపిల్ జ్యూస్, యాపిల్ సాస్, యాపిల్ పండు రూపంలో తినిపించి చూడగా, జ్యూస్ తాగిన వారిలో కడుపు నిండిన, ఆకలి తీరిన భావన కలగలేదు. అదే పండు రూపంలో నేరుగా తిన్న వారిలో కడుపు నిండినట్టు భావన కలిగింది. పండ్లు, కూరగాయలు రెండింటిలోనూ ఆల్కాలిన్ ఉంటుంది. అందులోనూ ఆప్రికాట్స్, కాంటలోప్ మినహా కూరగాయల్లో ఆల్కలైజింగ్ ఎక్కువ. . శరీర ద్రవాల్లో ఆల్కాలిన్ ఉండడం చాలా అవసరం. కూరగాయల్లోని ఆల్కాలిన్ మన శరీరంలో పీహెచ్ ను సమతుల్యం చేస్తుంది. సరైన ఆరోగ్యానికి ఈ పీహెచ్ బ్యాలన్స్ ఎంతో అవసరం.
జ్యూస్ రూపంలో వద్దు

అలాగే, జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని, తేలిగ్గా జీర్ణమవుతుందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. నిజానికి నేరుగా తినడం కంటే జ్యూస్ రూపంలో తీసుకోవడం ఆరోగ్యకరమని శాస్త్రీయ పరిశోధనలు ఇంత వరకు నిర్ధారించలేదు. ఒకవేళ పండు, కూరగాయలను నేరుగా తినలేని పరిస్థితుల్లో మాత్రమే జ్యూస్ తీసుకోవడం మినహా మరో ఆప్షన్ లేదు. అయితే, ఇలాంటప్పుడు జ్యూస్ చేసుకున్న తర్వాత పండులో తినదగిన భాగాలను కూడా తింటే ఫైబర్ ఎంతో కొంత అందుతుంది. జ్యూస్ చేసుకున్న వెంటనే తాగేయాలి. లేదంటే నిమిషాల వ్యవధిలోనే బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. జ్యూస్ లో అధిక చక్కెరలు ఉంటాయి గనుక బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
More Articles







ఔషధ గుణాల రోజా....ఆరోగ్యానికి రాజా
3 years ago
Advertisement
Telugu News

నలుగురిని ప్రేమించిన అమ్మాయి... గ్రామ పెద్దలు ఏంచేశారంటే..!
3 hours ago
Advertisement 36

ఒకటి కాదు, రెండు కాదు... రూ.24 కోట్లు!... దుబాయ్ లో లాటరీ కొట్టిన భారతీయుడు
3 hours ago

కేంద్రం ఇచ్చిన ర్యాంకును హైదరాబాద్ ప్రజలు అంగీకరించరు: నగర మేయర్ విజయలక్ష్మి
3 hours ago

లింగుస్వామి సినిమాలో కృతిశెట్టి.. అధికారిక ప్రకటన!
4 hours ago

ఉత్పత్తి పెంచాలని ఒపెక్ దేశాలను కోరిన భారత్... గతేడాది చవకగా కొనుగోలు చేసిన చమురు వాడుకోవాలన్న సౌదీ
4 hours ago

గ్లోబల్ ఉమన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైన తెలంగాణ గవర్నర్ కు ఏపీ గవర్నర్ అభినందనలు
4 hours ago

హైదరాబాదులో డబుల్ డెక్కర్ బస్సులు.. టెండర్లకు ఆహ్వానం!
4 hours ago

ఢిల్లీ పెద్దల పాదపూజ రాష్ట్రం కోసం కాదు, కేసుల మాఫీ కోసం అని తేలిపోయింది: సీఎం జగన్ పై నారా లోకేశ్ వ్యాఖ్యలు
5 hours ago

మేమిచ్చే రూ.5 వేలు చూస్తారా... ప్రియాంక కోసిన 5 టీ ఆకులు చూస్తారా?: అసోం బీజేపీ చీఫ్
5 hours ago

పీసీసీ, ప్రచార కమిటీ పదవులు ఒకే సామాజికవర్గానికి ఇవ్వొద్దని రాహుల్ ని కోరాను: మధుయాష్కీ
5 hours ago

నాకు కరోనా పాజిటివ్... టేకాఫ్ కు కొద్దిముందుగా చెప్పిన విమాన ప్రయాణికుడు
5 hours ago

అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలతో కలకలం రేపిన వాహనం యజమాని ఆత్మహత్య
6 hours ago

ఈ బ్లడ్ గ్రూపు వ్యక్తులకు కరోనా ముప్పు తక్కువట!
6 hours ago

విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ప్రకటించిన చంద్రబాబు
6 hours ago

భారత మార్కెట్లోకి కొత్త సెడాన్ ను తీసుకువస్తున్న బీఎండబ్ల్యూ
6 hours ago

అభిజిత్ తో భారీ డీల్ కుదుర్చుకున్న అన్నపూర్ణ స్టూడియోస్
6 hours ago

శ్రీకాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం
6 hours ago

ఆదాయపు పన్ను పేరుతో.. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో కోత విధించిన ఏపీ ప్రభుత్వం
7 hours ago

అహ్మదాబాద్ టెస్టు: ముగిసిన రెండోరోజు ఆట... టీమిండియాకు 89 పరుగుల ఆధిక్యం
7 hours ago

ఏపీలో మరోసారి 100కి పైగా కరోనా కేసులు
7 hours ago