బీమా ఏ వయసు వరకు తీసుకోవాలి..? నిండు నూరేళ్లు అవసరమా..?
16-11-2017 Thu 13:55

జీవిత బీమా అవసరం సంపాదనలో పడిన ప్రతీ ఒక్కరికీ అవసరమేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, జీవిత బీమాలోనూ ఒకటికి మించిన ఆప్షన్లు కొందరిని సందేహంలోకి నెట్టేస్తాయి. ముఖ్యంగా బీమా పాలసీని ఏ వయసు వరకు తీసుకోవాలన్నది ఓ పట్టాన అర్థం కాదు. అవసరాన్ని బట్టి నిండు నూరేళ్ల వరకు పాలసీని తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీమా పాలసీ ఎప్పటి వరకు తీసుకోవాలన్న దానిపై నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

టర్మ్ పాలసీ
నిర్ణీత కాలానికి జీవిత బీమా రక్షణనిచ్చే పాలసీ ఇది. కాల వ్యవధి తర్వాత రాబడుల రూపంలో ఏమీ తిరిగి రాదు. తక్కువ ప్రీమియానికి ఎక్కువ రక్షణ ఈ పాలసీల్లో ఉంటుంది. ఇవి కాకుండా జీవిత బీమా రక్షణతోపాటు కాల వ్యవధి ముగిసిన తర్వాత పాలసీదారుడు జీవించి ఉంటే రాబడులను అందించే సంప్రదాయ బీమా పొదుపు పథకాలు ఉండనే ఉన్నాయి. వీటిలో ప్రీమియం ఎక్కువ, రక్షణ తక్కువ ఉంటుంది. వీటిలోనే జీవితాంతం రక్షణనిచ్చే పాలసీలను హోల్ లైఫ్ పాలసీలు లేదా పర్మినెంట్ పాలసీలుగా వ్యవహరిస్తున్నారు.
హోల్ లైఫ్ పాలసీ

ఒకవేళ 25 ఏళ్లలోపు వారు అయితే, సాధారణ పాలసీని తీసుకుని కాల వ్యవధి తీరే సమయంలో హోల్ లైఫ్ పాలసీని ఎంచుకోవడం ప్రయోజనకరం అంటున్నారు. ఎందుకంటే ముందు నుంచే హోల్ లైఫ్ పాలసీ ఎంచుకుంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. టర్మ్ పాలసీల్లోనూ రకాలున్నాయి. జీవితానికి రక్షణ కల్పించే బీమా పాలసీలే కాకుండా రుణాలకు సంబంధించి టర్మ్ పాలసీలు, ఇంటి సంరక్షణకు సంబంధించి, బస్సు, రైలు ప్రయాణాలకు ఇలా పలు రకాలుగా టర్మ్ పాలసీలు పనిచేస్తున్నాయి.
ఏగాన్ రెలిగేర్ సంస్థ లైఫ్ ఐటర్మ్ పాలసీని ఆఫర్ చేస్తోంది. సాధారణంగా లైఫ్ టర్మ్ పాలసీలు 30 నుంచి 35 ఏళ్లకే పరిమితం. ఈ కాల వ్యవధి వరకు ప్రీమియం చెల్లిస్తేనే పాలసీ మనుగడలో ఉంటుంది. పాలసీ కాల వ్యవధి తీరిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. కానీ హోల్ లైఫ్ పాలసీలు జీవిత కాలం రక్షణ కల్పిస్తాయి. అంటే 100 ఏళ్ల వరకు. ప్రీమియం మాత్రం పరిమిత కాలం పాటే ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి హోల్ లైఫ్ పాలసీ తీసుకుంటే ప్రీమియం 60వ ఏట వరకు కడితే సరిపోతుంది. ఆ తర్వాత నుంచి ప్రీమియం చెల్లించక్కర్లేదు. కానీ పాలసీ మాత్రం కొనసాగుతుంది.
ఏగాన్ రెలిగేర్ హోల్ లైఫ్ టర్మ్ ప్లాన్ చూస్తే, 30 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించే గడువుతో పాలసీ తీసుకుంటే 60వ ఏట వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ పాలసీ హోల్ లైఫ్ టర్మ్ ప్లాన్ గా మారుతుంది. సాధారణ ప్రీమియం చెల్లించే సమయంలో పాలసీదారుడు మరణిస్తే బీమా పరిహారం చెల్లించినట్టే, ప్రీమియం చెల్లింపు కాలం ముగిసిన తర్వాత నూరేళ్ల వరకు ఎప్పుడు మరణించినా నామినీలకు పరిహారం చెల్లించడం జరుగుతుంది. ఆ తర్వాత పాలసీని క్లోజ్ చేస్తారు. అంటే పాలసీదారుడి మరణంతో పాలసీ కూడా ముగిసి పోతుంది.
సాధారణంగా 100 ఏళ్ల లోపు ఏదో ఒక వయసులో చనిపోవడం ప్రకృతి ధర్మం. కనుక తన మరణానంతరం వారసులకు కొంత నిధి ఇద్దామనుకునేవారు, తన మరణానంతరం ఎదురయ్యే వ్యయాల భారం వారసులపై పడకూడదని ఆలోచించే వారు హోల్ లైఫ్ టర్మ్ ప్లాన్లను ఎంపిక చేసుకుంటుంటారు.
ప్రీమియం భారం

ఇంత భారీ వ్యత్యాసంతో హోల్ లైఫ్ ప్లాన్ తీసుకోవడం దండగే. కాకపోతే ప్రీమియం సాధారణ టర్మ్ ప్లాన్, హోల్ లైఫ్ పాలసీల మధ్య 10 శాతం వ్యత్యాసానికి మించకుండా ఉంటే వాటిని పరిశీలించొచ్చు. హోల్ లైఫ్ టర్మ్ ప్లాన్ కు బదులు సాధారణ టర్మ్ తో కూడిన అంటే 60వ ఏట వరకు పాలసీ తీసుకుని పైన రెలిగేర్ పాలసీలో చెప్పినట్టే 7,500 చెల్లించడం నయం. మిగిలిన మేర రిస్క్ తక్కువ ఉండే ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినా వారసులకు నిధి అందించొచ్చు. పై ఉదాహరణలో హోల్ లైఫ్ టర్మ్ ప్లాన్ కు ఏటా రూ.40,000 చెల్లించాలి. సాధారణ టర్మ్ పాలసీకి రూ.7,500 చెల్లిస్తే సరిపోతుంది.
అందుకే, సాధారణ టర్మ్ పాలసీ తీసుకుని, మరోవైపు ప్రతీ నెలా రూ.3,000 చొప్పున మ్యూచువల్ ఫండ్స్ లో 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినా 12 శాతం వార్షిక రాబడి ప్రకారం 60వ ఏట వచ్చేసరికి సుమారు కోటీ ఐదు లక్షల రూపాయల నిధి సమకూరుతుంది. అందుకే సాధారణ టర్మ్ ప్లాన్ తో పోల్చుకుంటే హోల్ లైఫ్ టర్మ్ ప్లాన్ ప్రీమియం 10 శాతానికి మించకుండా ఉంటేనే తీసుకోవాలి. ఎక్కువ ప్రీమియం ఉంటే సాధారణ పాలసీ తీసుకుని మిగిలిన మేర మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడమే బెటర్.
బీమా రక్షణ ఎప్పటి వరకు

అంతేకానీ, సాధారణ సూత్రమైన 60వ ఏట వరకు తీసుకోవడం కరెక్ట్ కాదు. కొందరు చాలా చిన్న వయసులోనే జీవితంలో మెరుగైన స్థితికి చేరుకుంటారు. అధిక సంపాదన స్థితికి వెళతారు. వీరికి, ఇతరులతో పోలిస్తే బీమా రక్షణ అంతగా అవసరం ఉండకపోవచ్చు. బీమా పాలసీల్లో గరిష్ట కాల వ్యవధి కొన్నింటిలో 30, 35 ఏళ్లు మాత్రమే ఉంటోంది. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి ఈ తరహా పాలసీ తీసుకుంటే గరిష్టంగా 35 ఏళ్లే కనుక 60వ ఏట వరకే బీమా కవరేజీ ఉంటుంది. కానీ, అప్పటికి బాధ్యతలు అన్నీ తీరిపోవాలని లేదు. కనుక గరిష్ట కాల వ్యవధిపై పరిమితులు లేని పాలసీని ఎంచుకోవడమే నయం.
More Articles







ఔషధ గుణాల రోజా....ఆరోగ్యానికి రాజా
3 years ago
Advertisement
Telugu News

భారత సైబర్ నిపుణుడికి బంపర్ బొనాంజా అందించిన మైక్రోసాఫ్ట్
7 hours ago
Advertisement 36

యాదాద్రి ఆలయంలోకి వస్తే వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలి: అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు
7 hours ago

న్యూజిలాండ్ లో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ
8 hours ago

ఇతర పార్టీల్లో ఉండే అసంతృప్తులు, ఊహాగానాలు మా పార్టీలో కనిపించవు: సజ్జల
8 hours ago

అహ్మదాబాద్ టెస్టులో కోహ్లీ, స్టోక్స్ మధ్య మాటల యుద్ధం
8 hours ago

'ఈగ' సుదీప్ తో 'సాహో' దర్శకుడి ప్రాజక్ట్?
8 hours ago

ఆస్తి పన్ను పెంచుతామంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది: బొత్స
8 hours ago

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరంలేదన్న కేంద్రం... కేటీఆర్ ఆగ్రహం
9 hours ago

ఇలాంటి నష్టం ఇంకెవరికీ జరగకూడదనే ఫిర్యాదు చేశా: దర్శకుడు వెంకీ కుడుముల
9 hours ago

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కోసం పేర్ల నమోదుకు అవకాశం: వైద్య ఆరోగ్య శాఖ
9 hours ago

ఇతర దేశాలకు అమ్ముకుంటున్నాం, దానం చేస్తున్నాం తప్ప కరోనా వ్యాక్సిన్ మనకేదీ?: ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి
9 hours ago

నిర్బంధ ఏకగ్రీవాలా... దమ్ముంటే వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి: సీపీఐ నారాయణ
10 hours ago

ఆ ట్రైన్ కోసం నేనూ, పవన్ ఎదురుచూసేవాళ్లం: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి
10 hours ago

టీచర్ల చేతుల్లో ఉండే పెన్నులు గన్నులుగా మారతాయి... జాగ్రత్త: బండి సంజయ్
11 hours ago

ఏపీలో మరో 102 మందికి కరోనా
11 hours ago

విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత... ఖరారు చేసిన టీడీపీ అధినాయకత్వం
11 hours ago

నా అరెస్టుకు కుట్ర చేస్తున్నారు: లోక్ సభ స్పీకర్ కు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు
11 hours ago

ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరుతున్నా: కర్నూలు రోడ్ షోలో చంద్రబాబు
12 hours ago

కళ్లు చెదిరే లెవెల్లో పూజ హెగ్డే పారితోషికం!
12 hours ago

అహ్మదాబాద్ టెస్టులో ముగిసిన తొలిరోజు ఆట
12 hours ago