బ్యాంకుల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్... ప్రీమియం తక్కువే... మరి లాభం ఎంత?
24-10-2017 Tue 14:48

వైద్య బీమా పాలసీ అవసరం నేడు ప్రతి ఒక్క కుటుంబానికీ ఉంది. వైద్య చికిత్సల ఖర్చులు తడిసి మోపెడు అవుతున్న రోజుల్లో అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే బీమా లేని సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. వైద్య బీమా పాలసీని నేరుగా బీమా సంస్థ నుంచి తీసుకుంటే ప్రయోజనమా? లేక బ్యాంకు శాఖల నుంచి తీసుకుంటే లాభదాయకమా? అన్న ప్రశ్న ఇటీవల తరచుగా ఎదురవుతోంది. దీనికి కారణం బ్యాంకులు బీమా పాలసీలను తక్కువ ప్రీమియానికి ఆఫర్ చేస్తుండడమే. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఏది లాభకరమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నేడు దాదాపుగా అన్ని బ్యాంకులు వైద్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. ప్రీమియం, ఫీచర్ల పరంగా ఇవి చాలా ఆకర్షణీయంగానూ ఉంటున్నాయి. అలా అని ఈ పాలసీలు నిజంగా ప్రయోజనకరమా? అంటే సమాధానం కోసం మరిన్ని వివరాలను పరిశీలించాల్సిందే. బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ పాలసీలను అందించడం వెనుక రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి ఆయా పాలసీల ద్వారా కమిషన్ రాబట్టుకోవడం. రెండోది కొంచెం తక్కువ ప్రీమియానికే ఆఫర్ చేయడం ద్వారా ఉన్న కస్టమర్లను కాపాడుకోవడం, కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడం.
లాభాలు

ఉదాహరణకు 'సింద్ఆరోగ్య' పేరుతో సిండికేట్ బ్యాంకు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ తో టైఅప్ అయి పాలసీని అందిస్తోంది. ఇందులో 30 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వారి వరకూ అందరికీ ఒకటే ప్రీమియం. వయసును బట్టి పెరగకపోవడం ఆకర్షణీయం. ఇదే పాలసీని నేషనల్ ఇన్సూరెన్స్ నుంచి నేరుగా తీసుకోవాలనుకుంటే 55 ఏళ్ల వ్యక్తికి రూ.10,000 వరకు ప్రీమియం ఉంటుంది. కానీ, ఇదే వయసున్న వ్యక్తి బ్యాంకు ఆఫ్ బరోడా అందించే హెల్త్ పాలసీ (దంపతులు, ఇద్దరు పిల్లలకు) తీసుకుంటే ప్రీమియం కేవలం రూ.4,500 మాత్రమే. పైగా బ్యాంక్ ఆఫ్ బరోడా హెల్త్ పాలసీలో రూమ్ అద్దెలు, వైద్యులు ఫీజలకు సంబంధించి ఎటువంటి సబ్ లిమిట్, కో పేమెంట్ తరహా షరతులు ఏవీ లేకపోవడం ఆకర్షణీయం.

ఇక కెనరా బ్యాంకు అందించే ఈజీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే అన్ని వయసుల వారికీ ఒకటే ప్రీమియంతో ఆఫర్ చేస్తుండడం విశేషం. వరుసుగా మూడేళ్ల పాటు క్లెయిమ్ లు లేకపోతే వైద్య బీమా మొత్తంలో ఒక శాతాన్ని హెల్త్ చెకప్ ల కోసం ఇచ్చే ఫీచర్ కూడా ఉంది. ఆస్పత్రి పాలవడానికి ముందు 30 రోజులు, తర్వాత 60 రోజుల వరకు వైద్య వ్యయాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే, అంబులెన్స్ చార్జీలు రూ.1,000 వరకు పొందొచ్చు. బ్యాంకులు అందించే పాలసీల్లో కొన్నింటిలో రెండో ఏట నుంచి మేటర్నిటీ కవరేజీ కూడా ఉంటోంది. పాలసీ మొత్తంలో ఇది 5 శాతానికే పరిమితం. ఉదాహరణకు రూ.3 లక్షల బీమా పాలసీ తీసుకుంటే రూ.15,000 మేటర్నిటీ కవరేజీకే పరిమితం. క్లెయిమ్ లు అన్నవి పాలసీదారుడు నేరుగా బీమా సంస్థ వద్దే దాఖలు చేసుకోవాలి.

ప్రతికూలతలు

బ్యాంకులు అందించే పాలసీల్లో బీమా మొత్తంపై పరిమితి ఉంటుంది. ఇది సాధారణంగా రూ.5 లక్షలుగా ఉంది. అయితే, ఇండియన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు మాత్రం రూ.10-20 లక్షల కవరేజీకి వీలు కల్పిస్తున్నాయి. కొన్ని 65 ఏళ్లు దాటిన తర్వాత బీమా మొత్తంపై గరిష్ట పరిమితి రూ.5 లక్షలుగా అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఈ విధమైన ఆంక్షలు ఇబ్బందికరమే. కానీ బీమా సంస్థల నుంచి తీసుకునే పాలసీల్లో ప్రీమియం అధికంగా చెల్లిస్తే ఎంత మొత్తానికైనా వైద్యబీమా పొందొచ్చు.

బ్యాంకులు అందించే బీమా పాలసీల ఫీచర్లు ఎప్పుడైనా మారిపోవచ్చు. బీమా కంపెనీలు తమ ప్రయోజనాల కోణంలో వీటిలో మార్పులు చేసే అవకాశం ఉంది. అందుకే పాలసీ తీసుకునే ముందే బ్యాంకు నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
బ్యాంకులకు, బీమా సంస్థలకు మధ్య ఒప్పందం పునరుద్ధరణకు నోచుకోకపోతే ఖాతాదారులు బీమా రక్షణ కోల్పోవాల్సి వస్తుంది. ఉదాహరణకు బీమా సంస్థ పాలసీల్లో మార్పులు చేస్తూ, ప్రీమియం పెంచేస్తుంటే అది సమంజసం కాదని బ్యాంకు భావిస్తే... బీమా సంస్థతో ఒప్పందాన్ని కొనసాగించుకోకుండా పుల్ స్టాప్ పెట్టేయవచ్చు. దీంతో బ్యాంకు మరో బీమా సంస్థతో టైఅప్ అయి పాలసీని అందించే వరకూ వేచి చూడాల్సి వస్తుంది. ఈ కాలంలో బీమా రక్షణ ఉండదు. పెద్ద వయసులో ఉన్న వారికి ఇది ప్రతికూలమే అవుతుంది.

బ్యాంకుల నుంచి పాలసీ తీసుకునేట్టు అయితే తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. జీవిత కాలం పాటు రెన్యువల్ కు అవకాశం ఉందో లేదో కనుక్కోవాలి. కొన్నింటిలో ఇది 80 ఏళ్ల వరకే ఉంది. అలాగే, కొన్ని పాలసీల్లో వైద్య పరీక్షలకు అయ్యే వ్యయాలకు పరిహారం వర్తించడం లేదు. ఇక పాలసీ తీసుకునేందుకు ప్రవేశ వయసు ఎంతో కూడా కనుక్కోవాలి. అన్ని బ్యాంకుల పాలసీల్లోనూ ముందస్తు వ్యాధులకు కవరేజీ కోసం కనీసం మూడేళ్ల పాటు వేచి ఉండే కాలం అమల్లో ఉంది.
చాలా ముఖ్యమైనవి

More Articles







ఔషధ గుణాల రోజా....ఆరోగ్యానికి రాజా
3 years ago
Advertisement
Telugu News

భారత సైబర్ నిపుణుడికి బంపర్ బొనాంజా అందించిన మైక్రోసాఫ్ట్
7 hours ago
Advertisement 36

యాదాద్రి ఆలయంలోకి వస్తే వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలి: అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు
8 hours ago

న్యూజిలాండ్ లో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ
8 hours ago

ఇతర పార్టీల్లో ఉండే అసంతృప్తులు, ఊహాగానాలు మా పార్టీలో కనిపించవు: సజ్జల
8 hours ago

అహ్మదాబాద్ టెస్టులో కోహ్లీ, స్టోక్స్ మధ్య మాటల యుద్ధం
8 hours ago

'ఈగ' సుదీప్ తో 'సాహో' దర్శకుడి ప్రాజక్ట్?
8 hours ago

ఆస్తి పన్ను పెంచుతామంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది: బొత్స
9 hours ago

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరంలేదన్న కేంద్రం... కేటీఆర్ ఆగ్రహం
9 hours ago

ఇలాంటి నష్టం ఇంకెవరికీ జరగకూడదనే ఫిర్యాదు చేశా: దర్శకుడు వెంకీ కుడుముల
9 hours ago

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కోసం పేర్ల నమోదుకు అవకాశం: వైద్య ఆరోగ్య శాఖ
9 hours ago

ఇతర దేశాలకు అమ్ముకుంటున్నాం, దానం చేస్తున్నాం తప్ప కరోనా వ్యాక్సిన్ మనకేదీ?: ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి
10 hours ago

నిర్బంధ ఏకగ్రీవాలా... దమ్ముంటే వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి: సీపీఐ నారాయణ
10 hours ago

ఆ ట్రైన్ కోసం నేనూ, పవన్ ఎదురుచూసేవాళ్లం: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి
10 hours ago

టీచర్ల చేతుల్లో ఉండే పెన్నులు గన్నులుగా మారతాయి... జాగ్రత్త: బండి సంజయ్
11 hours ago

ఏపీలో మరో 102 మందికి కరోనా
11 hours ago

విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత... ఖరారు చేసిన టీడీపీ అధినాయకత్వం
11 hours ago

నా అరెస్టుకు కుట్ర చేస్తున్నారు: లోక్ సభ స్పీకర్ కు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు
12 hours ago

ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరుతున్నా: కర్నూలు రోడ్ షోలో చంద్రబాబు
12 hours ago

కళ్లు చెదిరే లెవెల్లో పూజ హెగ్డే పారితోషికం!
12 hours ago

అహ్మదాబాద్ టెస్టులో ముగిసిన తొలిరోజు ఆట
12 hours ago