మ్యూచువల్ ఫండ్స్ పైనా రుణం తీసుకోవచ్చు... ఇలా!
23-08-2017 Wed 13:03

రుణం తీసుకోవాలంటే ఒకప్పుడు ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. హామీలు, పూచీకత్తులు ఇలా ఎన్నో అవసరమయ్యేవి. రోజుల తరబడి రుణాల కోసం తిరగాల్సి వచ్చేది. కానీ, నేడు రుణం తీసుకునేందుకు ఎన్నో మార్గాలు, ఎన్నో అవకాశాలున్నాయి. అందులో మ్యూచువల్ ఫండ్స్ పై రుణం కూడా ఒకటి. మీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఉంటే అమ్మే పని లేకుండా వాటి సాయంతో సులభంగా రుణం పొందొచ్చు మరి.
దీర్ఘకాలంలో మంచి రాబడుల కోసం, లక్ష్యాల సాధన కోసం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఫండ్స్ లో పెట్టుబడులు వెనక్కి తీసుకునే వారూ ఉన్నారు. ఇలా చేస్తే ఏ లక్ష్యం కోసమైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దానికి విఘాతం ఏర్పడుతుంది. ఆ అవసరం లేకుండా మ్యూచువల్ ఫండ్స్ పై రుణం తీసుకోవడం ద్వారా అవసరాన్ని గట్టెక్కవచ్చు. పెట్టుబడులకు విఘాతం కూడా కలగదు. సిప్ రూపంలో ఫండ్స్ లో పెట్టుబడులనూ ఆపాల్సిన పనిలేదు.

ఎక్కువ మందికి సాధారణంగా మూడు నెలల నుంచి ఏడాది కాలం కోసమే రుణాలు అవసరమవుతాయి. అలాంటప్పుడు మీ దగ్గరున్న మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టడం ద్వారా రుణాన్ని తీసుకునే అవకాశం ఉంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీని (ఎన్ బీఎఫ్ సీ) అయినా ఆశ్రయించొచ్చు. స్వల్పకాలిక అవసరాల కోసం ఓవర్ డ్రాఫ్ట్ మాదిరిగా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణం తీసుకోవచ్చు. రుణంపై వడ్డీ రేటు ఎంతన్నది ఎంత రుణం తీసుకుంటున్నారనే అంశంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 10-11 శాతం మధ్య వడ్డీ రేటు ఉంది. తనఖా పెడుతున్న మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల విలువలో 60 శాతం వరకూ రుణంగా పొందడానికి అవకాశం ఉంది. తనఖా పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై హక్కులు రుణదాతలకు బదిలీ అవుతాయి. దీంతో రుణం తీర్చేవరకూ తిరిగి ఆ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు విక్రయించేందుకు, బదిలీ చేసేందుకు అవకాశం ఉండదు. డెట్ ఫండ్స్ కాకుండా ఈక్విట ఫండ్స్ పైనే రుణం తీసుకోవడం సముచితం.
ఎక్కడ తీసుకోవాలి...?
ఆన్ లైన్ వేదికలు సైతం రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను డీమ్యాట్ రూపంలో కలిగి ఉంటే వాటిని తనఖా పెట్టేందుకు ముందస్తు అనుమతి ఉండాలి. అదే ఫిజికల్ రూపంలో ఉంటే రుణదాతతో ముందస్తుగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో రుణమిచ్చే సంస్థ మ్యూచువల్ ఫండ్స్ రిజిస్ట్రార్ అయిన కామ్స్ (సీఏఎంఎస్) లేదా కార్వీ సంస్థను సంప్రదిస్తుంది. ఫలానా ఫోలియో నంబర్ తో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ను తనఖా పెట్టినట్టు, వాటిన లీన్ లో ఉంచాలని కోరుతుంది. దీంతో సంబంధిత యూనిట్లను లీన్ కింద ఉంచుతారు. రుణదాతకు, ఇన్వెస్టర్ కు ఈ విషయాన్ని తెలియజేస్తూ లేఖను కూడా పంపడం జరుగుతుంది.

రుణం తీర్చివేసిన తర్వాత రుణమిచ్చిన సంస్థే సంబంధిత మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను స్వాధీనం నుంచి విడుదల చేయాలని రిజిస్ట్రార్ ను కోరుతుంది. అవసరమైతే రుణం కొంత మేర తీర్చివేసిన తర్వాత ఆ మేరకు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల పార్షిక స్వాధీన విముక్తి కోసం కూడా లేఖ రాసేందుకు అవకాశం ఉంది.
రుణం తీర్చడంలో విఫలమైతే...?
రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించడంలో విఫలమైతే బ్యాంకు లేదా ఎన్ బీఎఫ్ సీ సంస్థ తనఖాగా ఉంచిన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను స్వాధీనం చేసుకుంటుంది. వాటిని రిడీమ్ చేసుకునేందుకు దరఖాస్తు పంపుతుంది. అప్పుడు ఫండ్స్ హౌస్ ఆ యూనిట్లను విక్రయించి సంబంధిత రుణదాతకు చెక్ పంపుతుంది.
More Articles







ఔషధ గుణాల రోజా....ఆరోగ్యానికి రాజా
3 years ago
Advertisement
Telugu News

హైదరాబాద్లో సగం మందికి తెలియకుండానే వచ్చి పోయిన కరోనా.. 54 శాతం మందిలో యాంటీబాడీలు!
7 minutes ago
Advertisement 36

భారత సైబర్ నిపుణుడికి బంపర్ బొనాంజా అందించిన మైక్రోసాఫ్ట్
8 hours ago

యాదాద్రి ఆలయంలోకి వస్తే వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలి: అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు
8 hours ago

న్యూజిలాండ్ లో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ
8 hours ago

ఇతర పార్టీల్లో ఉండే అసంతృప్తులు, ఊహాగానాలు మా పార్టీలో కనిపించవు: సజ్జల
8 hours ago

అహ్మదాబాద్ టెస్టులో కోహ్లీ, స్టోక్స్ మధ్య మాటల యుద్ధం
9 hours ago

'ఈగ' సుదీప్ తో 'సాహో' దర్శకుడి ప్రాజక్ట్?
9 hours ago

ఆస్తి పన్ను పెంచుతామంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది: బొత్స
9 hours ago

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరంలేదన్న కేంద్రం... కేటీఆర్ ఆగ్రహం
9 hours ago

ఇలాంటి నష్టం ఇంకెవరికీ జరగకూడదనే ఫిర్యాదు చేశా: దర్శకుడు వెంకీ కుడుముల
9 hours ago

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కోసం పేర్ల నమోదుకు అవకాశం: వైద్య ఆరోగ్య శాఖ
10 hours ago

ఇతర దేశాలకు అమ్ముకుంటున్నాం, దానం చేస్తున్నాం తప్ప కరోనా వ్యాక్సిన్ మనకేదీ?: ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి
10 hours ago

నిర్బంధ ఏకగ్రీవాలా... దమ్ముంటే వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి: సీపీఐ నారాయణ
10 hours ago

ఆ ట్రైన్ కోసం నేనూ, పవన్ ఎదురుచూసేవాళ్లం: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి
10 hours ago

టీచర్ల చేతుల్లో ఉండే పెన్నులు గన్నులుగా మారతాయి... జాగ్రత్త: బండి సంజయ్
11 hours ago

ఏపీలో మరో 102 మందికి కరోనా
11 hours ago

విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత... ఖరారు చేసిన టీడీపీ అధినాయకత్వం
12 hours ago

నా అరెస్టుకు కుట్ర చేస్తున్నారు: లోక్ సభ స్పీకర్ కు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు
12 hours ago

ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరుతున్నా: కర్నూలు రోడ్ షోలో చంద్రబాబు
12 hours ago

కళ్లు చెదిరే లెవెల్లో పూజ హెగ్డే పారితోషికం!
12 hours ago