మీ ఆధార్ డేటా భద్రంగా ఉందా...? దుర్వినియోగం కాకుండా ఇలా లాక్ చేసుకోండి...!
09-08-2017 Wed 14:17

ఆధార్ నేడు అన్నింటికీ ఆధారమైన అత్యంత ముఖ్యమైన, విలువైన గుర్తింపు పత్రం. అందులోనూ ఈ మధ్య 'ఈ కేవైసీ' అంటూ ఎలక్ట్రానిక్ రూపంలోనే మన ఆధార్ వివరాలు ఇచ్చే వ్యవస్థ వచ్చేసింది. ఇంతటి ముఖ్యమైన ఆధార్ వివరాలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో పడితే? లేని పోని సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఆధార్ ను చాలా భద్రంగా చూసుకోవాలి. అదెలాగన్నది చూద్దాం...
ఆధార్ వివరాలు చాలా గోప్యంగా ఉంచడం ఎంతో అవసరం. చాలా మంది వ్యక్తుల ఆధార్ వివరాలు లీకయ్యాయంటూ ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టులోనూ కేసు విచారణ నడుస్తోంది. వ్యక్తి గోప్యత హక్కులో భాగంగా ఆధార్ వివరాల్ని చూడాలని, వాటిని లీక్ కాకుండా చూడాలన్నదే ఆ పిటిషన్ సారాంశం. ఈ నేపథ్యంలో టెక్నాలజీ యుగంలో విలువైన ఎలక్ట్రానిక్ ఆధార్ వివరాలు దుర్వినియోగం కాకుండా, వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం.
ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న సమయంలో మన వేలి ముద్రలు, కంటి పాపలను స్కాన్ చేయడం గుర్తుండే ఉంటుంది. మన వ్యక్తిగత వివరాలన్నింటికీ ఈ రెండే ప్రధాన గుర్తింపులు. వేలి ముద్రలు, కనుపాపలు అన్నవి ప్రతీ వారికీ విభిన్నంగా ఉంటాయి. ఒకరికి మరొకరితో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవవు. అందుకే గుర్తింపునకు ఈ రెండింటినీ ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ కేవైసీ విధానంలో ఆధార్ నంబర్ ఇచ్చిన తర్వాత మన వివరాల్ని పొందేది వీటి ఆధారంగానే. బ్యాంకులు, టెలికం ఆపరేటర్లు ప్రస్తుతం ఈ కేవైసీ విధానాన్ని పాటిస్తున్నాయి.
ఈ కేవైసీ
ఆధార్ కు నమోదు చేసుకునే సమయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ మన పేరు, చిరునామా, పుట్టిన తేదీ, వయసు, జెండర్, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ ఇలా సమస్త సమాచారంతోపాటు ఐరిస్ (కనుపాపలు), ఫింగర్ ప్రింట్స్ (వేలి ముద్రలు), వ్యక్తి ఫొటోను తీసుకుని తన డేటా బ్యాంకులో భద్రపరుస్తుంది. ఈ డేటాకు సంబంధించి ఆధార్ నంబర్ ను కేటాయిస్తుంది. ఈ డేటాలోని వివరాలను పొందేందుకు వేలి ముద్రలు, కనుపాపలే కీలకం.
అలాగే, కొత్తగా సిమ్ కార్డు తీసుకునేందుకు ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నంబర్ ఆధారంగా వేలి ముద్రలు తీసుకుని, ఆధార్ డేటాలోని మీ వివరాల్ని టెలికం సంస్థలు పొందుతాయి. ఆ వివరాల్ని తమ డేటాలో ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచుకుంటాయి. బ్యాంకు ఖాతా అయినా, మొబైల్ సిమ్ కార్డు అయినా, మరెక్కడైనా కానీయండి. ఈ కేవైసీ కోసం వేలిముద్రలు, కనుపాపలు ఇచ్చిన వెంటనే మీ మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ వస్తుంది. అలాగే, ఈ మెయిల్ కు సందేశం వస్తుంది. ‘‘ఈ కేేవైసీ ధ్రువీకరణ కోసం మీ ఆధార్ నంబర్ ను విజయవంతంగా ఫలానా చోట, ఫలానా సమయంలో ఇవ్వడం పూర్తయింది’’ అంటూ అందులో సమాచారం ఉంటుంది. మొబైల్ నంబర్ కూ ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు ధ్రువీకరణ ఇవ్వకపోతే వెంటనే 1947కు కాల్ చేయాలని, [email protected] కు మెయిల్ చేయాలని అందులో సూచన ఉంటుంది.
దుర్వినియోగానికి అవకాశాలు
ఆధార్ జిరాక్స్ కాపీని ఇచ్చారనుకోండి. దాన్ని వేరొకరు జిరాక్స్ తీసుకుని వాడుకునేందుకు అవకాశం ఉంది. అదే ఈ కేవైసీలో భాగంగా ఇచ్చే ఎలక్ట్రానిక్ ఆధార్ దుర్వినియోగం అయ్యేందుకు అవకాశం లేదా...? అంటే ఉందనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేవైసీలో భాగంగా వేలి ముద్రలు ఇస్తాం. ఆ వేలిముద్రలను స్కాన్ చేసే యంత్రం కంప్యూటర్ కు కనెక్ట్ చేసి ఉంటుంది. ఈకేవైసీ ఆథెంటికేషన్ కోసం తీసుకునే వేలిముద్రలను కాపీ చేసుకుని రహస్యంగా భద్రపరిచి కస్టమర్ వెళ్లిన తర్వాత వాటిని ఆథెంటికేషన్ కోసం దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. అందుకే, ఇలా లీకయ్యేందుకు, దుర్వినియోగానికి అవకాశం లేకుండా యూనిక్ ఐడెంటిఫకేషన్ అథారిటీ లాక్, అన్ లాక్ సదుపాయాలను తీసుకొచ్చింది.

ఎంతో విలువైన వ్యక్తిగత డేటా కనుక దుర్వినియోగం జరగకుండా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ లాక్, అన్ లాక్ సదుపాయాల్ని ప్రవేశపెట్టింది. ఆన్ లైన్ ద్వారా ఈ సదుపాయాల్ని వినియోగించుకోవచ్చు. మీ బయోమెట్రిక్ వివరాల్ని లాక్ చేశారనుకోండి. వేలిముద్రలు, కనుపాపల్ని ఆథెంటికేషన్ కోసం మీతోపాటు ఇతరులు ఎవరూ వాడుకునేందుకు అవకాశం ఉండదు. తిరిగి వాడుకోవాలనుకుంటే మీరు స్వయంగా ఆన్ లాక్ చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ సదుపాయం ఉన్నవారికే ఈ అవకాశం. ఇందుకోసం ఆథార్ డేటా బేస్ లో మీ మొబైల్ నంబర్ కూడా నమోదై ఉండాలి. నమోదు అయిలేకపోతే ముందుగా ఆథార్ నంబర్ కు మొబైల్ నంబర్ ను లింక్ చేసుకోవాలి. ఎందుకంటే లాక్, అన్ లాక్ చేసే సమయంలో వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) మీ మొబైల్ నంబర్ కు వస్తుంది. ఈ ఓటీపీ ఇస్తేనే లాక్, అన్ లాక్ అవుతుంది. మొబైల్ నంబర్ నమోదు చేసుకునేందుకు సమీపంలోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కు వెళ్లి దరఖాస్తు ఇస్తే సరిపోతుంది.


ఆథార్ లాక్ సదుపాయం కోసం https://resident.uidai.gov.in/biometric-lock# ఈ లింక్ ను సందర్శించాలి. అనంతరం అక్కడ ఆథార్ నంబర్ బాక్స్ లో ఆథార్ నంబర్ ను పేర్కొని, కిందనున్న ఎంటర్ సెక్యూరిటీ కోడ్ కాలమ్ లో పక్కన కనిపించే నాలుగంకెలను టైప్ చేసి కింద ‘సెండ్ ఓటీపి’ని ఓకే చేయాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని పక్కనున్న ఓటీపీ బాక్స్ లో ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీ 30 నిమిషాల పాటే చెల్లుబాటు అవుతుంది. ఆలోపే దాన్ని ఓటీపీ బాక్స్ లో ఇచ్చి లాగిన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత వచ్చే పేజీలో ఎంటర్ సెక్యూరిటీ కోడ్ బాక్స్ లో పక్కన కనిపించే నాలుగంకెలను ఎంటర్ చేసి ‘ఎనేబుల్’ బటన్ ను క్లిక్ చేయాలి. దాంతో ‘అభినందనలు. మీ బయోమెట్రిక్ లాక్ అయింది’ అంటూ సందేశం కనిపిస్తుంది.

ఆథార్ కార్డును లాక్ చేసిన తర్వాత, ఎక్కడైనా ఈకేవైసీ కింద ఆథార్ వివరాలు ఇవ్వాలంటే ముందు అన్ లాక్ చేసుకోవాలి. ఇందుకోసం https://resident.uidai.gov.in/biometric-lock# ఈ లింక్ సాయంతో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ సైట్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఆథార్ నంబర్ బాక్స్ లో ఆథార్ నంబర్ ను ఇచ్చిన తర్వాత, కింద బాక్స్ లో దాని పక్కన కనిపించే సెక్యూరిటీ కోడ్ ను నమోదు చేయాలి. సెండ్ ఓటీపీ బటన్ ను క్లిక్ చేయాలి. మీ మొబైల్ కు వచ్చే ఓటీపీని పక్కన కనిపించే బాక్స్ లో ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి. తర్వాత పేజీకి వెళుతుంది. అక్కడ కనిపించే బాక్స్ లో పక్కనే కనిపిస్తున్న నాలుగంకెల సెక్యూరిటీ కోడ్ ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానికింద కనిపించే అన్ లాక్ బటన్ ను ఓకే చేయాల్సి ఉంటుంది. దాంతో అది అన్ లాక్ అయిపోతుంది. ఇది 10 నిమిషాల పాటే అన్ లాక్ అయి ఉంటుందని గుర్తుంచుకోండి. ఆ లోపే ఆథార్ ఆథెంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పది నిమిషాల తర్వాత ఆటోమేటిక్ గా లాక్ అయపోతుంది. కావాలంటే మరోసారి అన్ లాక్ చేసుకోవాల్సిందే.

More Articles







ఔషధ గుణాల రోజా....ఆరోగ్యానికి రాజా
3 years ago
Advertisement
Telugu News

భారత సైబర్ నిపుణుడికి బంపర్ బొనాంజా అందించిన మైక్రోసాఫ్ట్
7 hours ago
Advertisement 36

యాదాద్రి ఆలయంలోకి వస్తే వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలి: అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు
8 hours ago

న్యూజిలాండ్ లో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ
8 hours ago

ఇతర పార్టీల్లో ఉండే అసంతృప్తులు, ఊహాగానాలు మా పార్టీలో కనిపించవు: సజ్జల
8 hours ago

అహ్మదాబాద్ టెస్టులో కోహ్లీ, స్టోక్స్ మధ్య మాటల యుద్ధం
8 hours ago

'ఈగ' సుదీప్ తో 'సాహో' దర్శకుడి ప్రాజక్ట్?
8 hours ago

ఆస్తి పన్ను పెంచుతామంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది: బొత్స
9 hours ago

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరంలేదన్న కేంద్రం... కేటీఆర్ ఆగ్రహం
9 hours ago

ఇలాంటి నష్టం ఇంకెవరికీ జరగకూడదనే ఫిర్యాదు చేశా: దర్శకుడు వెంకీ కుడుముల
9 hours ago

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కోసం పేర్ల నమోదుకు అవకాశం: వైద్య ఆరోగ్య శాఖ
9 hours ago

ఇతర దేశాలకు అమ్ముకుంటున్నాం, దానం చేస్తున్నాం తప్ప కరోనా వ్యాక్సిన్ మనకేదీ?: ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి
10 hours ago

నిర్బంధ ఏకగ్రీవాలా... దమ్ముంటే వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి: సీపీఐ నారాయణ
10 hours ago

ఆ ట్రైన్ కోసం నేనూ, పవన్ ఎదురుచూసేవాళ్లం: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి
10 hours ago

టీచర్ల చేతుల్లో ఉండే పెన్నులు గన్నులుగా మారతాయి... జాగ్రత్త: బండి సంజయ్
11 hours ago

ఏపీలో మరో 102 మందికి కరోనా
11 hours ago

విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత... ఖరారు చేసిన టీడీపీ అధినాయకత్వం
11 hours ago

నా అరెస్టుకు కుట్ర చేస్తున్నారు: లోక్ సభ స్పీకర్ కు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు
12 hours ago

ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరుతున్నా: కర్నూలు రోడ్ షోలో చంద్రబాబు
12 hours ago

కళ్లు చెదిరే లెవెల్లో పూజ హెగ్డే పారితోషికం!
12 hours ago

అహ్మదాబాద్ టెస్టులో ముగిసిన తొలిరోజు ఆట
12 hours ago