పెద్దల కోసం భద్రతతో కూడిన సరికొత్త పెన్షన్ పాలసీ... 'వయ వందన యోజన'!
13-08-2017 Sun 13:22

వృద్ధాప్యంలో భద్రతతో కూడిన స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలకే పెద్దలు ఎక్కువగా ఓటేస్తారు. ఈ తరహాకు చెందిన ఓ సంప్రదాయ పెన్షన్ పాలసీని కేంద్ర సర్కారు ‘ప్రధానమంత్రి వయవందన యోజన’ పేరుతో తీసుకొచ్చింది. ఇందులో ఉన్న సానుకూల, ప్రతికూలతలపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...
మన దేశంలో అవ్యవస్థీకృత రంగంలోని వారు, స్వయం ఉపాధితో జీవితాన్ని నెట్టుకొచ్చిన వారికి 60 ఏళ్ల తర్వాత తక్షణం నెలవారీ పెన్షన్ ఇచ్చే పాలసీలు మార్కెట్లో పరిమితంగానే ఉన్నాయి. ఎన్ పీఎస్, యూనిట్ ఆధారిత పెన్షన్ పథకాలు, బీమా కంపెనీలు అందించే ఇతర పెన్షన్ పథకాలన్నీ కూడా భవిష్యత్తులో రిటైర్ అయ్యే వారి కోసం. ఇక యాన్యుటీ అంటూ పెట్టుబడి పెట్టిన మొత్తంపై మరుసటి నెల నుంచే ఆదాయాన్నిచ్చే పథకాలూ ఉన్నాయి. కాకపోతే వీటిపై రాబడి తక్కువే. నెలవారీ ఆధాయాన్నిచ్చే పథకాల్లో ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒక్కటే 8.3 శాతం రాబడినిస్తుంది. మిగతావన్నీ8 శాతంలోపు వడ్డీ రేటున్నవే. మరి ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం వయవందన యోజన అంటూ 8 శాతం వడ్డీ రేటుతో పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం నిర్వహణ బాధ్యతను ఎల్ఐసీ చూస్తోంది.

ప్రతీ నెలా పెన్షన్
నెలవారీ పెన్షన్ పొందాలంటే కనీసం రూ.1,44,578 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ఠంగా రూ.7,22,892 పెట్టుబడి పెట్టుకోవచ్చు. అప్పుడు ప్రతీ నెలా కనిష్ఠ పెట్టుబడిపై రూ.1,000 రూపాయలు, గరిష్ఠ పెట్టుబడిపై రూ.5,000 పెన్షన్ గా అందుతుంది.
మూడు నెలలకోసారి పెన్షన్
కనీసం రూ.1,47,601 పెట్టుబడి పెట్టాలి. గరిష్ఠంగా రూ.7,38,007 ఇన్వెస్ట్ చేయవచ్చు. అప్పుడు మూడు నెలలకోమారు కనిష్ఠ పెట్టుబడిపై రూ.3,000 గరిష్ఠ పెట్టుబడిపై రూ.15,000 పెన్షన్ వస్తుంది.
ఆరు నెలలకోసారి
కనిష్ఠంగా రూ.1,49,068, గరిష్ఠంగా రూ.7,45,342 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ప్రతీ ఆరు నెలలకు కనిష్ఠ మొత్తంపై రూ.6,000, గరిష్ఠ మొత్తంపై రూ.30,000 పెన్షన్ గా చెల్లిస్తారు.

కనిష్ఠంగా రూ.1,50,000, గరిష్ఠంగా రూ.7,50,000తో పాలసీ తీసుకోవచ్చు. అప్పుడు కనిష్ఠ మొత్తంపై రూ.12,000, గరిష్ఠ మొత్తంపై రూ.60,000 పెన్షన్ అందుకోవచ్చు.
మరింత సరళంగా చెప్పుకోవాలంటే ప్రతీ రూ.1,000 పెట్టుబడిపై నెలవారీ అయితే రూ.80, మూడు నెలలకోసారి కోరుకుంటే రూ.80.50, ఆరు నెలలకోసారి తీసుకుంటే రూ.81.30, ఏడాదికోసారి తీసుకుంటే రూ.83 ఆదాయంగా లభిస్తుంది.
కొన్ని పరిమితులు
ఇక్కడ పేర్కొన్న గరిష్ఠ పెన్షన్ ఒక కుటుంబం మొత్తానికి అని అర్థం చేసుకోవాలి. పెన్షనర్, వారి జీవిత భాగస్వామి, పెన్షనర్ పై ఆధారపడిన వారిని కలిపి ఓ కుటుంబంగా పరిగణిస్తారు. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురి పేర్లపై ఇన్వెస్ట్ చేయకుండా ఈ పరిమితి విధించారు. పెన్షన్ ను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. పాలసీ కాల వ్యవధి ముగిసేలోపు (10 ఏళ్లలోపు) పాలసీదారుడు మరణిస్తే పెట్టుబడి మొత్తాన్ని నామినీ లేదా వారసులకు చెల్లించేస్తారు. పెన్షన్ ను ఎప్పటికప్పుడు చెల్లిస్తుంటారు గనుక గడువు తీరిన తర్వాత అసలు మాత్రమే చెల్లిస్తారు. కాల వ్యవధి తీరేలోపే ఈ పథకం నుంచి వైదొలగాలంటే ప్రత్యేక కారణాల్లో అనుమతిస్తారు. తీవ్ర అనారోగ్యానికి లోనై చికిత్స తీసుకోవాలనుకునే వారు పెట్టుబడి మొత్తంలో 98 శాతాన్ని వెనక్కి తీసేసుకోవచ్చు. మూడేళ్ల తర్వాత అవసరం అనుకుంటే రుణం తీసుకునేందుకు అవకాశం ఉంది. పెట్టుబడి మొత్తంలో 75 శాతాన్ని రుణంగా ఇస్తారు. రుణంపై 10 శాతం వడ్డీ పడుతుంది. పెట్టుబడి పెట్టి, పాలసీ తీసుకున్న తర్వాత అందులోని నిబంధనలు, ఇతర అంశాలు నచ్చకపోతే వెనక్కిచ్చేయవచ్చు. ఆన్ లైన్ లో అయితే 30 రోజులు, ఆఫ్ లైన్ లో అయితే 15 రోజుల్లోపల ఈ అవకాశం ఉంది. ఈ పథకంలో పెట్టే పెట్టుబడి, వడ్డీ రాబడికీ ఎటువంటి పన్ను ప్రయోజనాలు లేవు.

రాబడికి హామీతోపాటు 8 శాతం వడ్డీ రేటు అన్నది ఫర్వాలేదనే చెప్పుకోవాలి. దీనికంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో మాత్రమే పెట్టుబడిపై 8.3 శాతం వడ్డీ అమల్లో ఉంది. మిగిలిన పథకాలన్నీ కూడా తక్కువ వడ్డీ రేటున్నవే. ఇందులో ప్రతీ నెలా గరిష్ఠ పెన్షన్ రూ.5,000 మాత్రమే. రూ.7.5 లక్షలకు మించి పెట్టుబడికి అవకాశం లేదు. ఇది ఓ కుటుంబానికి పూర్తిగా సరిపోయే అమౌంట్ కాదు. ముఖ్యంగా రిటైర్ అయిన వారికి ఈ ఆదాయం అన్ని అవసరాలనూ తీర్చలేదు. దీనికంటే కూడా మంచి డెట్ మ్యూచుల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి నెలవారీ క్రమానుగత ఉపసంహరణ రూపంలో ఆదాయం పొందడం నయమని ముంబైకి చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ సురేష్ శడగోపన్ అభిప్రాయపడ్డారు. నెలకు తక్కువ మొత్తంలో అవసరాలున్నవారికే ఇది అనుకూలమన్నారు.
More Articles







ఔషధ గుణాల రోజా....ఆరోగ్యానికి రాజా
3 years ago
Advertisement
Telugu News

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
7 minutes ago
Advertisement 36

ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్.. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
10 minutes ago

పైలట్పై దాడిచేసిన పిల్లి.. విమానం అత్యవసర ల్యాండింగ్
37 minutes ago

శ్రీకాకుళం జిల్లాలో 42 నాటు బాంబులు లభ్యం
52 minutes ago

హైదరాబాద్లో సగం మందికి తెలియకుండానే వచ్చి పోయిన కరోనా.. 54 శాతం మందిలో యాంటీబాడీలు!
1 hour ago

భారత సైబర్ నిపుణుడికి బంపర్ బొనాంజా అందించిన మైక్రోసాఫ్ట్
9 hours ago

యాదాద్రి ఆలయంలోకి వస్తే వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలి: అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు
9 hours ago

న్యూజిలాండ్ లో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ
9 hours ago

ఇతర పార్టీల్లో ఉండే అసంతృప్తులు, ఊహాగానాలు మా పార్టీలో కనిపించవు: సజ్జల
9 hours ago

అహ్మదాబాద్ టెస్టులో కోహ్లీ, స్టోక్స్ మధ్య మాటల యుద్ధం
10 hours ago

'ఈగ' సుదీప్ తో 'సాహో' దర్శకుడి ప్రాజక్ట్?
10 hours ago

ఆస్తి పన్ను పెంచుతామంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది: బొత్స
10 hours ago

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరంలేదన్న కేంద్రం... కేటీఆర్ ఆగ్రహం
10 hours ago

ఇలాంటి నష్టం ఇంకెవరికీ జరగకూడదనే ఫిర్యాదు చేశా: దర్శకుడు వెంకీ కుడుముల
10 hours ago

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కోసం పేర్ల నమోదుకు అవకాశం: వైద్య ఆరోగ్య శాఖ
11 hours ago

ఇతర దేశాలకు అమ్ముకుంటున్నాం, దానం చేస్తున్నాం తప్ప కరోనా వ్యాక్సిన్ మనకేదీ?: ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి
11 hours ago

నిర్బంధ ఏకగ్రీవాలా... దమ్ముంటే వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి: సీపీఐ నారాయణ
11 hours ago

ఆ ట్రైన్ కోసం నేనూ, పవన్ ఎదురుచూసేవాళ్లం: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి
11 hours ago

టీచర్ల చేతుల్లో ఉండే పెన్నులు గన్నులుగా మారతాయి... జాగ్రత్త: బండి సంజయ్
12 hours ago

ఏపీలో మరో 102 మందికి కరోనా
12 hours ago