రైతులకు పండుగలా మారిన రాష్ట్ర వ్యవసాయరంగం
23-06-2022 Thu 12:49

- తెలంగాణ రాష్ట్ర జీడీపీలో 20శాతం ఉన్న వ్యవసాయరంగాన్ని మరింత ఆధునికరించుటకు తోటలను ప్రోత్సాహిస్తున్న ప్రభుత్వం
- కూరగాయలు, పూలు, పండ్ల తోటల పెంపకంపైన రైతులకు అవగాహన కల్పించుటకు జీడిమెట్ల, ములుగులలో "సెంటర్ ఆఫ్ ఎక్షలెన్స్" క్షేత్రాలను నెలకొల్పిన ప్రభుత్వం
*ఆదాయంతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లు, వేడుకలు నిర్వహణలో అభిరుచులు మారుతున్నాయి. దేశవిదేశాల నుంచి దిగుమతి అవుతున్న పండ్లు,పూలు, కూరగాయలకు మన రాష్ట్రంలో విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ కు అనుగుణంగా పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తి వైపు మన రైతులను మళ్ళించుటకు "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" పేరున రెండు క్షేత్ర ప్రదర్శనశాలలను ప్రభుత్వం నెలకొల్పింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ములుగు లోని తెలంగాణ ఉద్యానవన విశ్వావిద్యాలయం ఆవరణలో వివిధ రకాల పండ్ల సాగుపై 53 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల సాగు కేంద్రాన్ని నెలకొల్పింది.
ములుగు ప్రదర్శన క్షేత్రంలో 30 ఎకరాలలో 9 రకాల పండ్ల జాతులకు చెందిన 49 ఎంపిక చేయబడిన వండడాలకు చెందిన 17,915 మొక్కలను దేశంలో ప్రసిద్ది గాంచిన పరిశోధన తెప్పించి నాటడం జరిగింది. వీటీలో 11 ఎకరాలలో మామిడి, 8 ఎకరాలలో నిమ్మ , బత్తాయి, 3.20 ఎకరాలలో జామ, 2.20 ఎకరాలలో దానిమ్మ, ఒక ఎకరము లో ఖర్జూర, 1.10 ఎకరములో చింత, 2.36 ఎకరాలలో సీతాఫలం, 0.25 ఎకరములో అల్లనేరేడు , డ్రాగన్ ప్రూట్ మొక్కలను పెంచడం జరుగుతున్నది. పండ్ల మొక్కలతో పాటు అగ్రోఫారెస్ట్రీ జాతులైన శ్రీగంధం, వెదురు మొక్కలను కూడా కొద్ది భూమీలో నాటారు. అలాగే అంతర్గతదారుల వెంట సరుగుడు (10284), పనస (200), అల్లనేరేడు (200) , కొబ్బరి (200), శ్రీగంధం (720) మొక్కలను ప్రదర్శన నిమిత్తం నాటారు.
ములుగు ప్రదర్శన క్షేత్రంలో అత్యాదునిక సాంకేతిక సేధ్య పద్దతులను ప్రభుత్వం రైతులకు పరిచయం చేస్తున్నది. సూక్ష్మ సేధ్యం, యాంత్రీకరణ, నీటి నిల్వ, నీటి సంరక్షణ, కొమ్మల కత్తిరింపులు, కోత అనంతర యాజమాన్య పద్దతులతో ఎగుమతి ప్రమాణాలు కలిగిన పండ్లను పండించుటలో నూతన యాజమాన్య పద్దతులను అమలు చేస్తున్నారు. నీటి యాజమాన్య నిర్వహణలో భాగంగా నీటి ఇంకుడు గుంతలు, కందకాలు నిర్మించారు.
తెలంగాణ భూములు, వాతావరణమునకు అనువైన చీడపీడలను తట్టుకుని అధికదిగుబడులు, అధికఆదాయాన్నిచ్చే పలు పండ్ల రకాల వంగడాలను ఈ ఎక్సలెంట్ సెంటర్ లో అభివృద్ధి చేస్తున్నారు. ఆ పండ్ల వంగడాల గురించి తెలుసుకుందాం.
1)మామిడి
*మామిడిలో అత్యధిక ఆదరణ పొందిన 16 ప్రముఖ రకాలు :- హిమాయత్, కేసర్, బెనిషాన్, దశేరి, దశేరి-35, మహాముదా, హైదర్ సాహెబ్, తోతపురి, అలఫోన్స, సింధు, ఆమ్రపాలి, సువర్ణరేఖ, రత్న, రాయల్ స్పెషల్ తో పాటు పచ్చడికి వినియోగించే అమిని, జలాల్ రకాల మొక్కలను 11 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు.వీటిలో 6 రకాలను సంగారెడ్డిలోని ఫల పరిశోదన కేంద్రం నుంచి, 4 రకాలను మహారాష్ట్రలోని దశేరి కృషి విద్యాపీట్ నుంచి తెప్పించారు.
2)బత్తాయి, నిమ్మ, కమలా
*ఈ పండ్లకు చెందిన 8 రకాల వంగడాలను నాగపూర్, జలగాం, దపోలి లతో పాటు నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లి పరిశోదన కేంద్రాల నుంచి తెప్పించి అభివృద్ధి చేస్తున్నారు.
3)జామ
*ఈ కేంద్రంలోని 3.5 ఎకరాల విస్తీర్ణంలో లక్నో, బెంగళూరు, రాయచూర్ ల నుంచి 5 రకాల జామ మొక్కలను అభివృద్ధి చేస్తున్నారు.
4)దానిమ్మ
*రెండున్నర ఎకరాలలో మృదుల, బగువ, సూపర్ బగువ రకాల దానిమ్మ రకాలను పూణే, సోలాపూర్ ల నుంచి తెప్పించి అభివృద్ధి చేస్తున్నారు.
5)సీతాఫలం
*సీతాఫలం సాగును వ్యాపార సరళిలో ప్రోత్సాహించుటకు దీర్ఘకాలం నిల్వకు అనుకూలంగా వుండే NMK-1 రకమును మహారాష్ట్ర నుంచి తెప్పించి 10 గుంటలలోను, బాలానగర్ రకమును 2 ఎకరముల 10 గుంటలలో నాటారు.
6)ఖర్జురా
*గుజరాత్ నుంచి 5 రకాల ఖర్జుర టిష్యూ కల్చర్ మొక్కలను తెప్పించి నాటారు.
7)చింత
*అనంతపురం పరిశోదన కేంద్రం నుంచి అనంతరుధిర,తెట్టు అమాలిక వంగడాలను తెప్పించి 1.1 ఎకరములో నాటారు.
8)అల్లనేరేడు
*అధిక దిగుబడి నిచ్చే బాహాడోలి అల్లనేరేడు వంగడమును మహారాష్ట్రలోని దాపోలి నుంచి తెచ్చి నాటారు.
9)డ్రాగన్ ఫ్రూట్
*విధేశీ పండు అయిన డ్రాగన్ ఫ్రూట్ రకాలను ప్రదర్శన నిమిత్తం నాటారు.
అలాగే 5 ఎకరాల్లో షేడ్ నెట్ పందిళ్లకింద శ్రీ గంధం మొక్కల నర్సరీని నెలకొల్పారు.
సంవత్సరానికి 80 లక్షల కూరగాయలు నారు ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఫ్లగ్ టైప్ నర్సరీని ఈ కేంద్రంలో నెలకొల్పారు. టమాటో, వంకాయ, మిరప, క్యాబేజి, కాలిప్లవర్, కాప్సికం మొదలగు నారు ఇక్కడ పెంచుతున్నారు.
దీనితో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలో కూరగాయలు, పూలు సాగుపై సెంటర్ ఆఫ్ ఎక్షలెన్స్ కేంద్రాన్ని ఉద్యానవన యూనివర్సిటీ ఏర్పాటు చేసింది.రైతులకు పండ్ల తోటల పెంపకంపైన మంచి శిక్షణ ఇచ్చి, మేలైన పండ్ల మొక్కల అంట్లను తయారుచేసి అందించడమే ఈ కేంద్రం ఏర్పాటు ఉద్దేశ్యం.అందులో భాగంగా 30 ఎకరాల ప్రదర్శన క్షేత్రంలో 11 ప్రధాన పండ్లకు సంబందించిన 52 రకాలకి చెందిన 17,915 మొక్కలను నాటారు. అగ్రిఫారెస్ట్రీకి సంబందించిన 5 జాతులకు చెందిన 14,747 మొక్కలు నాటారు. వీటితో పాటు మునగ, కరివేపాకు, మల్బరి మొక్కలను కూడా నాటారు.
రైతులు, విద్యార్థులు, పర్యటకులకు రాష్ట్ర ఉద్యానవన యూనివర్సిటీ ములుగు, జీడిమెట్లలో నెలకొల్పిన "సెంటర్ ఆఫ్ ఎక్షలెన్స్" ల సందర్శన ఒక మధుర జ్ఞాపకంగా నిలుస్తుంది. పండ్లు, కూరగాయలు, పూలు సాగులో ఆధునిక యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంచి,ఆసక్తి కలిగిస్తుంది.



More Press Releases

సివిల్స్ 2వ హబ్ గా హైదరాబాద్ - బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐఎఎస్
12 hours ago

Press Photos: PM Modi visit to Hyderabad - Arrival at Begumpet Airport
13 hours ago

తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. బోనాల ఉత్సవాలు..!
14 hours ago

నూతన క్యాంటిన్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన విజయవాడ నగర మేయర్
14 hours ago

మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమిష్టి కృషి: సునీతాలక్ష్మారెడ్డి
16 hours ago

లబ్దిదారులకు సత్వరమే రుణాల మంజూరుకు చర్యలు చేపట్టాలి: విజయవాడ మేయర్
22 hours ago

National Level Learn-shop on development of the MSME ecosystem organised by SIDBI & Grant Thornton Bharat (its PMU)
1 day ago

Press Release: ICAR-Directorate of Poultry Research, Rajendraagar, Hyderabad
1 day ago

పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు: మహిళాభివృద్ది , శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ సిరి
1 day ago

Union Bank of India launches a charity initiative ‘U Smile - Spread Smiles’
1 day ago

ఓల్డ్ సిటీ బోనాల కోసం 70 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు: మంత్రి తలసాని
1 day ago

CS Somesh Kumar held a meeting with officials of all welfare departments
1 day ago

Prime Minister Narendra Modi speaks on telephone with Russian President Vladimir Putin
1 day ago

₹1,44,616 crore gross GST Revenue collection for June 2022; increase of 56% year-on-year
1 day ago

TCL unveils cinematic advances
1 day ago

PM congratulates IN-SPACe and ISRO for successfully launching two payloads of Indian Start-ups in Space by PSLV C53
1 day ago

On the occasion of State Festival - Bonalu, CM KCR extends greetings to Telangana people
2 days ago

CS Somesh Kumar reviewed the arrangements made for the PM Modi’s visit to Hyderabad
2 days ago

పదో తరగతి ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థుల ప్రభంజనం
2 days ago

Chairman of Telangana Foods, Chairman of Telangana Official Language Association, President of Telangana Urdu Academy appointed by CM KCR
2 days ago

RBS' first foray into food & beverage retail with popular global food chain
2 days ago

విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్
2 days ago

ఆంగ్ల మాధ్యంలోనూ టీ-శాట్ గ్రూప్-1 పాఠ్యాంశాలు
2 days ago

St. Francis College, New York to provide scholarships up to USD 6800 to students from Hyderabad
2 days ago

Aakash+BYJU’S launches its first Classroom Centre in Kadapa in Andhra Pradesh
2 days ago
Advertisement
Video News

అల్లూరి సీతారామరాజు మనవలు, మునిమనవళ్లతో భేటీకానున్న మోదీ
2 minutes ago
Advertisement 36

ఏపీని నట్టేట ముంచిన మోదీని సీఎం స్వాగతించడమా? సిగ్గుండాలి: ఏపీ కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్ ఫైర్
17 minutes ago

హైదరాబాద్ మెట్రో సేవలు నేడు యథాతథం.. ఆ వార్తలు ఫేక్ అంటూ కొట్టిపడేసిన అధికారులు
52 minutes ago

20 రూపాయల చాయ్కి రూ. 50 సర్వీస్ చార్జ్.. శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలులో వింత: వైరల్ అవుతున్న ట్వీట్
1 hour ago

హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
1 hour ago

బర్మింగ్హామ్ టెస్టు: బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ విలవిల
2 hours ago

వీరమహిళలతో సెల్ఫీ దిగి ఉత్సాహపరిచిన పవన్ కల్యాణ్
10 hours ago

హైదరాబాదులో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గం తొలిరోజు సమావేశాలు
10 hours ago

కంగ్రాచ్యులేషన్స్ హర్షిణి... జగన్ తనయను అభినందించిన విజయసాయి
10 hours ago

అమెరికాలో కల్వకుంట్ల కవిత... ఆటా మహాసభలకు హాజరుకానున్న ఎమ్మెల్సీ
10 hours ago

విదేశాల్లో ఉన్నవారి నుంచి ఇకపై రూ.10 లక్షల వరకు అందుకోవచ్చు... కేంద్రానికి వివరాలు చెప్పనక్కర్లేదు!
11 hours ago

ఏర్పాట్లు ఆదుర్స్!... తెలంగాణ బీజేపీ నేతలకు మోదీ ప్రశంస!
11 hours ago

మహారాష్ట్రలో ఫార్మసిస్టు హత్య... నుపుర్ కు మద్దతు పలకడంతో చంపి ఉంటారని అనుమానం... ఎన్ఐఏ దర్యాప్తుకు కేంద్రం ఆదేశం
11 hours ago

టీమిండియా, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు
11 hours ago

ప్రధానిని స్వాగతించడానికి సీఎం కేసీఆర్ రాకపోవడం రాజ్యాంగాన్ని అవమానించడమే: కేంద్రమంతి స్మృతి ఇరానీ
12 hours ago

బుమ్రా హిట్టింగ్తో యువీని గుర్తు చేసుకున్న సచిన్
12 hours ago

బండకేసి కొడతానన్న రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం
12 hours ago

ముఖ్యమంత్రి గారూ... మీ విచిత్రమైన పాలనలో ఏదైనా సాధ్యమే!: వర్ల రామయ్య వ్యంగ్యం
12 hours ago

"పక్కవడ" పట్టుబట్టిన రాహుల్ గాంధీ
13 hours ago

హైదరాబాదులో మరో 261 మందికి కరోనా
13 hours ago