ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి: తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్

Related image

  • బియ్యం సేకరణలో మిల్లర్లు సహకరించాలి 
  • రైసు మిల్లర్ల సమావేశంలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: యాసంగి (2020-21) సీజన్ లోని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)కు సంబంధించి రైసు మిల్లుల్లో ఉన్న ధాన్యం నాణ్యత ప్రమాణాలు దెబ్బ తినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఘాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రైసు మిల్లర్లను, జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు, మిల్లర్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని సూచించారు. గత ఏడాది యాసంగిలో రికార్డుస్థాయిలో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం మిలర్లకు అప్పగించడం జరిగిందని, అయితే భారత ఆహార సంస్థ నుంచి ఎదురవుతున్న ప్రతిబంధకాల వల్ల బియ్యం అప్పగించడంలో జాప్యం జరుగుతోందని దీంతో మిల్లుల్లోనే 70 శాతం ధాన్యం నిల్వలు ఉన్నాయని అన్నారు.

యాసంగి సీజన్ సీఎంఆర్ సేకరణ, ఎఫ్ సిఐ నుంచి ఎదురవుతున్న సమస్యలపై గురువారంనాడు పౌరసరఫలభవన్లో కమిషనర్ అనిల్ కుమార్ తో కలిసి ఆయన రైసు మిల్లర్లతో సమీక్షించారు. డిమాండ్ మేరకు ఎఫ్ సిఐ స్టోరేజ్ స్పెస్ కల్పించడం లేదని 32 జిల్లాల నుంచి సమావేశంలో పాల్గొన్న రైసు మిల్లర్లు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. గోదాములను లీజుకు తీసుకునే విషయంలో ఎఫ్ సిఐ ఈ ఏడాది కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలతో సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు గారు చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగి ధాన్యం దిగుబడులు పెరుగుతున్నాయి.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా జోక్యం చేసుకోవడం వల్ల యాసంగికి సబంధించి అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైసు తీసుకోవడానికి ఎఫ్ సిఐ అంగికరించిందన్నారు. ఎఫ్ సిఐ నుంచి ఎదురవుతున్న సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని ఈ నేపథ్యంలో మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరించాలని మిల్లర్లుకు విజ్ఞప్తి చేశారు.

సీఎంకు కృతజ్ఞతలు: మిల్లర్లు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కృషి వల్లే ఎఫ్ సిఐ అదనంగా 20లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకోవడానికి అంగీకరించిందని, సీఎం కేసీఆర్ చొరవ వల్లే ఇది సాధ్యమైందని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కి రైసు మిల్లర్లు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్ రుక్మిణి, జనరల్ మేనేజర్ రాజిరెడ్డి, కన్సల్టెంట్ అశోక్ కుమార్ తో పాటు రైసు మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంప నాగేందర్, మెహన్ రెడ్డి పాల్గొన్నారు.

More Press Releases