ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా ట్రోఫీని గెలుచుకున్న 'తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ'

Related image

  • అధికారులకు శుభాకాంక్షలు తెలిపి, అభినందించిన ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: ఈ సంవత్సరం జరిగిన ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా ట్రోఫీని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ గెలుచుకున్నది. సెప్టెంబర్ 21న జరిగిన ఈ పోటీలో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ ఈ ఏడాది బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫ్లైయింగ్ క్లబ్ ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా రోలింగ్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని అధికారులు ఆయన అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ గెలుచుకున్న అవార్డును అకాడమీ సీఈఓ అండ్ సెక్రటరీ ఎస్ఎన్ రెడ్డి మంత్రికి అందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపి,అభినందించారు.

2003 సంవత్సరంలో ఈ ట్రోఫీని ఏర్పాటు చేసినట్లు ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ కెప్టెన్ అనీషా సురేష్ తెలిపారు. దేశవ్యాప్తంగా 21 ఫ్లయింగ్ ట్రైనింగ్ క్లబ్‌లు ఏరో క్లబ్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా ఉన్నాయని, ఏవియేషన్ పైలట్లు మరియు ఇంజనీర్లకు అబ్-ఇనిషియో శిక్షణకు సంబంధించి ఈ ఫ్లయింగ్ క్లబ్‌లు విలువైన సేవలను అందిస్తున్నాయన్నారు. ఒడిశాలోని జుహు కేంద్రంగా బాంబే శిక్షణ సంస్థ ఈ కార్యకలాపాలు నిర్వాహిస్తున్నది.

ఈ ట్రోఫీలో ఫ్లయింగ్ క్లబ్ రెండవ బహుమతి మరియు మూడవ బహుమతి ప్రభుత్వ విమానయానానికి లభించిందని అధికారులు మంత్రికి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి, క్యాప్టెన్ ఎస్ఎన్ రెడ్డి సీఈఓ అండ్ సెక్రటరీ, కె.ఎస్ రాజేశ్వర్ రావు ఏఏఓ, ఎన్. చంద్రశేఖర్ రావు వైస్ ప్రిన్సిపాల్
పలువురు పాల్గొన్నారు.

More Press Releases