జీఎస్టీ వల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గుతోంది: బుగ్గన

Related image

  • 45వ జీఎస్టీ మండలి సమావేశం దృష్టికి తీసుకు వచ్చిన బుగ్గన
  • సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ
అమరావతి: జీఎస్టీ ప్రవేశ పెట్టక పూర్వం వార్షిక వృద్ది 17శాతం వరకు ఉండగా, ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్ధితులు నెలకొన్నాయని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన లక్నోలో శుక్రవారం జరిగిన 45 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి బుగ్గన పలు సమస్యలను ప్రస్తావించారు.

రాష్ట్రం నుండి బుగ్గనతో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డాక్టర్ రజత్ భార్గవ, రాష్ట్ర వాణిజ్య పన్నుల ప్రధాన కమిషనర్ రవిశంకర్ నారాయణ్ సుడగాని, వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈసందర్భంగా సమావేశంలో బుగ్గన మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరచబడిన సమాఖ్య నిర్మాణం కింద రాష్ట్ర పన్నుల అధికారాలపై దృష్టి సారించాలన్నారు. పెట్రోల్, డీజిల్ విషయంలో జీఎస్టీ పరంగా ఆంధ్రప్రదేశ్ తన పూర్వవైఖరికే కట్టుబడి ఉందని వీటిని జీఎస్టీలో కలపవలసిన అవసరం లేదన్నారు. వ్యాట్ అమలు కాలంలో రాష్ట్రం యొక్క పూర్వ ఆదాయాలతో ప్రస్తుతం వస్తున్న జీఎస్టీ ఆదాయాలు ఏమాత్రం సరిపోలడం లేదన్నారు.

2017 లో జీఎస్టీ ప్రవేశపెట్టడానికి ముందు 3 సంవత్సరాల పాటు 14 నుండి 15శాతం సగటు వార్షిక వృద్ధిని నమోదు చేయగా, జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత గత 4 సంవత్సరాలలో దాని సగటు పెరుగుదల సుమారు 10శాతం మాత్రమే ఉందన్నారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం పరిహారం అందించడం తప్పనిసరన్నారు. మరోవైపు కరోనా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని, వచ్చే ఏడాది రాష్ట్ర ఆదాయాలు పుంజుకుంటాయని అంచనా వేసినా పరిస్ధితులు అందుకు అనుగుణంగా లేవని అన్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రానికి భారత ప్రభుత్వం నుండి పరిహారం రూపంలో అదనపు నిధులు తప్పనిసరని స్పష్టం చేసారు. ప్రతి సంవత్సరం 14శాతం వృద్ధికి భరోసా ఇస్తూ, 2025 వరకు పరిహారాన్ని పొడిగించాల్సిన అవసరాన్ని బుగ్గన నొక్కిచెప్పారు.

నాపరాయి ఫలకాలపై పన్ను రేటు అంశాన్ని ప్రధానం ప్రస్తావించిన మంత్రి పాలిష్ చేసిన ఫలకాలపై ఉన్న పన్ను రేటును 18శాతం నుండి 5శాతానికి పరిమితం చేయాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సౌర విద్యుత్ ప్లాంట్లు, మద్యం తయారీ కార్యకలాపాలలో జాబ్ వర్క్ లపై  పన్ను రేటును 5శాతానికి తగ్గించాలని అభ్యర్థించారు. మరోవైపు 28శాతం జీఎస్టీ, 12శాతం పరిహార సెస్సును ఆకర్షించే ఏరేటెడ్ పానీయాలతో సమానంగా మసాలా నీటిని శుద్ధి చేయాలా వద్దా అన్న అంశంపై అధ్యయనం చేయాలన్నారు. ఆదాయ పరంగా రాష్టం ఇబ్బందులలో ఉన్నందున, 2021 ఆగస్టు వరకు ఏపీకి చెల్లించాల్సిన పరిహారాన్ని త్వరగా విడుదల చేయాలని తద్వారా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించగలుగుతామని వివరించారు. ఈ సమావేశంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పాల్గొన్నారు.

More Press Releases