అత్యాధునిక మెగా డైరీ ప్రాజెక్ట్ కు భూమిపూజ చేసిన తెలంగాణ మంత్రులు

Related image

రంగారెడ్డి జిల్లా: చిన్న సన్నకారు రైతాంగానికి, పాడి పరిశ్రమకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర పాడి పరిశ్రమ సినిమా ఫోటోగ్రఫీ శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని రావిర్యాల గ్రామ పరిధిలో 32 ఎకరాల విస్తీర్ణంలో 246 కోట్ల వ్యయంతో తెలంగాణ విజయడెయిరీ ఆధ్వర్యంలో అత్యాధునిక మెగా డైరీ ప్రాజెక్ట్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పశు సంవర్థక శాఖ, సినీమా ఫోటోగ్రఫీ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సహకార రంగానికి సంబంధించి దేశంలో పాడి పంట ఇబ్బంది వచ్చినప్పుడు పాడి పైన ఆధారపడే సన్నకారు చిన్నకారు రైతాంగానికి చేయూతనివ్వాలనే సంకల్పంతో విజయ డెయిరీ ప్రారంభమైనదని 2014 తెలంగాణ రాష్ట్రం రాకముందు విజయ డెయిరీ మూతపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అప్పట్లో ఒక లక్ష లీటర్ల పాలు సేకరించే వారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో రైతాంగాన్ని ప్రోత్సహించి ఆర్థికంగా తోడ్పాటునందించి దేశంలో ఫ్రైవేట్ పోటీ రంగంలో విజయ డెయిరీ మొదటి స్థానంలో ఉందన్నారు. 2014 లో 300 కోట్ల టర్నోవర్ ఉండేదని నేడు 750 కోట్ల టర్నోవర్తో విజయ తెలంగాణ ముందుకు వెళుతుందన్నారు. నాలుగున్నర లక్షల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతుందని అన్నారు. విజయ డెయిరీ ప్రాజెక్టును రెండు సంవత్సరాలలో పూర్తి చేయాలనే లక్ష్యం ఉండగా ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి చేయాలనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆలోచన అని అన్నారు. 8 లక్షల లీటర్ల వరకు ఈ ప్రాంతంలో కొత్త టెక్నాలజీ ఉత్పత్తులను నిర్వహిస్తున్నామని, విజయడెయిరీ ఉత్పత్తులు 28 వరకు సంస్థలు ఉన్నాయని, మన రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబయిలో డిమాండ్ ఉన్నాయని తెలిపారు.

ఒకవైపున సన్నకారు చిన్నకారు రైతులను ప్రోత్సహిస్తూ అదేవిధంగా వేలాదిమంది యువతీయువకులకు ఉపాధి  కల్పిస్తున్నామని అన్నారు. సీజన్ ఉన్న లేకున్నాప్రభుత్వం 365 రోజులు పాలను సేకరిస్తున్నామని, ఫ్రైవేట్ రంగంలో 365రోజులు పాల సేకరణ చేయరని అన్నారు. పాడి రంగానికి ప్రభుత్వం ఇన్సెటివ్కల్పిస్తుందని అన్నారు. రైతులను ఆదుకునేందుకు సబ్సిడీపై పాడి పశువులు,ఉచితంగా నట్టల మందు, మందులు ఇవ్వడం జరుగుతుంది.

మెడికల్ క్యాంపులనుప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగారైతాంగానికి ఉచితంగా 24 గంటల కరెంటు కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణరాష్ట్రం అని ఆయన అన్నారు. రైతు బంధు రైతు బీమా వంటి పథకాలను ప్రభుత్వంకల్పిస్తుందన్నారు. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల మంది నిరుద్యోగయువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 అవుట్ లెట్లు ఉన్నాయని 600 పార్లర్లు వీటినిఇంకా పెంపొందించు కుంటూ ముందుకు వెళుతున్నామని ఆయన అన్నారు. 2లక్షల 13వేల మంది రైతులు సహకార సంఘంలో ఉన్నారన్నారు. చనిపోయిన గేదెల స్థానంలోఇన్సూరెన్స్ ద్వారా గేదెలను అందజేస్తామని అన్నారు.

గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం కావాలని అన్నారు.  కుల వృత్తులను ప్రభుత్వం చేయూతనిస్తుందని అన్నారు. విజయ డైరీకి సంబందించిన 14 రకాల ఉత్పత్తులనుమార్కెట్ లోకి విడుదల చేశారు.విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంఏర్పడ్డ తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచే భాగంగా పాడి పంటలురెండు బాగుండాలని సంకల్పంతో విజయ మెగా డెయిరీ శంకుస్థాపన చేయడం ఎంతోసంతోషంగా ఉందని అన్నారు. పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలని  గొల్లకురుమల ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశ్యంతో గొర్రెలను ఇవ్వడంజరుగుతుందన్నారు.

11 వేల కోట్ల రూపాయలుతో గొర్రెలను ఇవ్వడం జరుగుతుందనిఅన్నారు.  ఇంతకు ముందు చేపలు కావాలంటే ఈస్ట్ గోదావరి నుంచి తీసుకురావాలన్నారు. మన చెరువులు కుంటలలో తెలంగాణలో ఎక్కడ వెళ్లిన చేపలుదొరుకుతున్నాయని అన్నారు. వృత్తి ఏదైనా ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వంకృషి చేస్తుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ సమీపాన ఉన్నదనిహైదరాబాద్ సంబంధించిన పాల ఉత్పత్తికి డిమాండ్ కి అనుగుణంగా అందుకోలేకపోతున్నామని అన్నారు.

కొత్తగా పాడి పరిశ్రమ పెట్టుకునే వారికి సబ్సిడీకింద పాడి రుణాలను ఇస్తే బాగుంటుందని అన్నారు. మన వ్యవస్థని మనంకాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయ డెయిరీని బలోపేతం చేసుకొనిదానిపైన వచ్చిన లాభాలు రైతులకు వస్తాయని తెలిపారు. ప్రతి పాడి రైతు విజయడెయిరీకి పాలు ఇచ్చే విధంగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఇగ్గె మల్లేశం, సురభి వాణి దేవి, జిల్లాచైర్పర్సన్ తీగల అనిత రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, అడిషనల్ డైరక్టర్ రాంచందర్ , టీఎ స్ఎస్ ఎల్డిఏ సీఈఓ మంజువాణి, జిల్లాకలెక్టర్ అమోయ్ కుమార్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం, తుక్కుగూడమున్సిపల్ చైర్మన్ మధుమేహన్, వైస్ చైర్మన్ వెంకన్న, విజయ డైరీ చైర్మన్లోక భూమారెడ్డి, విజయ డైరీ ఎండి శ్రీనివాస్ రావు, సహకార సంఘాల సభ్యులు,రైతులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases